Rajasthan: గీజర్ గ్యాస్‌ లీకై ఊపిరాడక దంపతులు మృతి

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడితో అప్పటివరకు హోలీ ఆడి ఆనందంగా గడిపిన దంపతులు.. స్నానం కోసం వెళ్లి బాత్‌రూంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూంలో ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. శివనారాయణ ఝన్వర్ (37), అతని భార్య కవితా ఝన్వర్ (35), కుమారుడు విహాన్, షాపురా నివాసితులు షీత్లా అష్టమి రోజున రంగులతో ఆడుకున్నారని విచారణ అధికారి జితేంద్ర సింగ్ తెలిపారు.

Read Also: New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

రెండు గంటలకు పైగా ముగ్గురు బాత్‌రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టినా స్పందన లేదు. వారు తలుపు పగులగొట్టి, గీజర్ ఆన్‌లో ఉండగా వారు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చిన్నారికి చికిత్స అందిస్తుండగా దంపతులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.