NTV Telugu Site icon

Rajashekar : టాలీవుడ్ లో మళ్లీ రచ్చ చేస్తున్న ‘మగాడు’

Rajashekar

Rajashekar

Rajashekar : ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా సరే టైటిల్ చాలా ముఖ్యం. అలాంటి టైటిల్స్‌ పవర్‌ ఫుల్‌గా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కనుక ఒక సినిమా టైటిల్‌ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా కథను, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని టైటిల్‌ను ఖరారు చేస్తారు. కథతో సంబంధం ఉండటంతో పాటు, ప్రేక్షకులకు క్యాచీగా, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ కు అనుగుణంగా క్రియేటివ్‌గా టైటిల్స్ పెట్టడంలో ఈ కాలం దర్శకులు ముందు ఉంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాకుండా కథకు కుదిరితే పాత టైటిల్స్ ను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన ‘మగాడు’ సినిమా టైటిల్‌ను మళ్లీ వినియోగించేందుకు యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ రెడీ అవుతున్నారు. రాజశేఖర్‌ హీరోగా కె మధు దర్శకత్వంలో మగాడు సినిమా వచ్చింది. మాలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన మూన్నం మూర సినిమాకు రీమేక్ గా సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాతో రాజశేఖర్‌ జనాల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఒక కిడ్నాప్‌ డ్రామాగా ఆ సినిమా రూపొందింది. ఆ టైటిల్‌తో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుందన్న వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. మహేష్ బాబు మగాడు సినిమా రాలేదు. దాంతో మగాడు టైటిల్ గురించి అంతా మర్చిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ టైటిల్‌ గురించి చర్చ మొదలైంది.

Read Also:IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!

దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ రాజశేఖర్‌ అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న సినిమాకు మగాడు టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మగాడు సినిమాతో రాజశేఖర్‌ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ సాధినేని ఇటీవల చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన నేపథ్యంలో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. రాజశేఖర్‌ హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇటీవల నితిన్‌ హీరోగా రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలో కనిపించాడు. రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also:MLC Jeevan Reddy: జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య..