Rajalinga Moorthy Murder Case: రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను కలిసిన పౌర హక్కుల సంఘం నేతలు
- రాజలింగమూర్తి హత్యపై పౌర హక్కుల సంఘం సందర్శన – నిజనిర్ధారణ పరిశీలన
- కేసులో అనుమానాస్పద అంశాలు – పోలీసుల తీరుపై ప్రశ్నలు
- సీబీసీఐడీ దర్యాప్తు కోసం డిమాండ్ – సీఎం రేవంత్ రెడ్డికి పౌర సంఘాల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajalinga Moorthy Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర,ఉమ్మడి జిల్లా,జిల్లా కమిటీ ల నేతలు శుక్రవారం కలిశారు. రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజనిర్ధారణ చేసుకునేందుకే పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరిగిన హత్యపై పలువురు స్థానికులను, రాజలింగమూర్తి భార్యను కలిసి వివరాలు సేకరించుకున్నాము,మరికొంత సమాచారం కొరకు పోలీసులను కూడా కలవనున్నామని తెలిపారు. సామాజిక కార్యకర్తగా ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములపై పోరాటం సాగించాడని, మేడిగడ్డ బ్యారేజ్ కొంగుబాటుపై కోర్టులో కేసు వేయగా విచారణకు ముందు రోజే హత్యకు గురి కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఎఫ్ఐఆర్లో మృతిని భార్య ఇచ్చిన సమాచారం కాకుండా వేరే సమాచారాన్ని నమోదు చేయడం అనుమానాలకు తావిస్తుందని, హత్య జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆ స్థలం నుంచి వెళ్లి తరలించడంలో పోలీసుల అత్యుత్సాహం కూడా అనుమానంగా వుందని వారు తెలిపారు.
డీఎస్పీ సంపత్ రావు రాజలింగమూర్తిని పిలిపించిన రోజే హత్యకు గురి కావడం ఏంటని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం కోసం పోరాడే వారిని ఎవరు చంపిన నేరమే అని వారు వ్యాఖ్యానించారు. మృతుని భార్య తెలుపుతున్నట్లుగా కేసుతో సంబంధం ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి,హరిబాబు మరి కొంత మంది పేర్లు ఆందోళనకరంగా ఉన్నాయని, న్యాయ నిర్ధారణ చేసే హక్కు పోలీసులకు లేదన్నారు. కేసుతో ఎవరెవరికి సంబంధం ఉందో తెలియాల్సి ఉందని, జరిగిన హత్యపై మృతుని భార్య కోరినట్లుగా సిబిసిఐడిచే విచారణ జరిపించాలి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందే,,,నిజంగా లక్షల కోట్ల అవినీతి జరిగితే బయటికి చెప్పవలసిందేనని, కేసును బలహీనపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించిన,హంతకులు ప్రవర్తించిన అది మరొక నేరంగా పరిగణించాల్సిందేనని, ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీసీఐడీకి అప్పగించి బాధితులకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Kedar Selagamsetty: నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ.. 100 కోట్ల అప్పు!
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!