Rajalinga Moorthy Murder Case: రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను కలిసిన పౌర హక్కుల సంఘం నేతలు
- రాజలింగమూర్తి హత్యపై పౌర హక్కుల సంఘం సందర్శన – నిజనిర్ధారణ పరిశీలన
- కేసులో అనుమానాస్పద అంశాలు – పోలీసుల తీరుపై ప్రశ్నలు
- సీబీసీఐడీ దర్యాప్తు కోసం డిమాండ్ – సీఎం రేవంత్ రెడ్డికి పౌర సంఘాల విజ్ఞప్తి
Rajalinga Moorthy Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర,ఉమ్మడి జిల్లా,జిల్లా కమిటీ ల నేతలు శుక్రవారం కలిశారు. రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజనిర్ధారణ చేసుకునేందుకే పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరిగిన హత్యపై పలువురు స్థానికులను, రాజలింగమూర్తి భార్యను కలిసి వివరాలు సేకరించుకున్నాము,మరికొంత సమాచారం కొరకు పోలీసులను కూడా కలవనున్నామని తెలిపారు. సామాజిక కార్యకర్తగా ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములపై పోరాటం సాగించాడని, మేడిగడ్డ బ్యారేజ్ కొంగుబాటుపై కోర్టులో కేసు వేయగా విచారణకు ముందు రోజే హత్యకు గురి కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఎఫ్ఐఆర్లో మృతిని భార్య ఇచ్చిన సమాచారం కాకుండా వేరే సమాచారాన్ని నమోదు చేయడం అనుమానాలకు తావిస్తుందని, హత్య జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆ స్థలం నుంచి వెళ్లి తరలించడంలో పోలీసుల అత్యుత్సాహం కూడా అనుమానంగా వుందని వారు తెలిపారు.
డీఎస్పీ సంపత్ రావు రాజలింగమూర్తిని పిలిపించిన రోజే హత్యకు గురి కావడం ఏంటని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం కోసం పోరాడే వారిని ఎవరు చంపిన నేరమే అని వారు వ్యాఖ్యానించారు. మృతుని భార్య తెలుపుతున్నట్లుగా కేసుతో సంబంధం ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి,హరిబాబు మరి కొంత మంది పేర్లు ఆందోళనకరంగా ఉన్నాయని, న్యాయ నిర్ధారణ చేసే హక్కు పోలీసులకు లేదన్నారు. కేసుతో ఎవరెవరికి సంబంధం ఉందో తెలియాల్సి ఉందని, జరిగిన హత్యపై మృతుని భార్య కోరినట్లుగా సిబిసిఐడిచే విచారణ జరిపించాలి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందే,,,నిజంగా లక్షల కోట్ల అవినీతి జరిగితే బయటికి చెప్పవలసిందేనని, కేసును బలహీనపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించిన,హంతకులు ప్రవర్తించిన అది మరొక నేరంగా పరిగణించాల్సిందేనని, ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీసీఐడీకి అప్పగించి బాధితులకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Kedar Selagamsetty: నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ.. 100 కోట్ల అప్పు!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో