NTV Telugu Site icon

Heavy Rains: మధ్యప్రదేశ్‌లో వరుణుడి ప్రతాపం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Madhyapradesh

Madhyapradesh

Heavy Rains: మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, తూర్పు మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ (64.5 మిమీ నుండి 115.5 మిమీ) నుంచి అతి భారీ (115.6 మిమీ నుండి 204.4 మిమీ) వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ హెచ్చరిక మంగళవారం ఉదయం వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది.

Also Read: PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని

పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో కూడా మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక పేర్కొంది. సాగర్, నర్సింగపూర్, బేతుల్, మాండ్లా, సియోని, చింద్వారా, బాలాఘాట్, జబల్‌పూర్ జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సీనియర్ వాతావరణ నిపుణుడు వేద్ ప్రకాష్ సింగ్ తెలిపారు. అశోక్ నగర్, భోపాల్, సెహోర్, విదిహా, రైసెన్, బుర్హాన్‌పూర్, రత్లాం, దామోహ్, ఛతర్‌పూర్, కట్నీ, షాహ్‌డోల్, అనుప్పూర్, సింగ్రౌలీ, సిధి, ఉమారియాలో మెరుపులతో కూడిన మోస్తరు వర్షం (15.6 మిమీ నుండి 64.4 మిమీ వరకు) పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం, షియోపూర్, శివపురి, గుణ, అగర్ మాల్వా, రాజ్‌గా, ఉజ్జయిని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షం (2.5 మిమీ నుండి 15.5 మిమీ వరకు) కురిసే అవకాశం ఉంది.

Also Read: Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!

సోమవారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 21 జిల్లాల్లో వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా బేతుల్ జిల్లాలో 120.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో భోపాల్‌లో 77.2 మిమీ, రత్లాం 61.0 మిమీ, ఖర్గోన్ 59.8 మిమీ, మాండ్లా 54.4 మిమీ, జబల్‌పూర్ 55.0 వర్షపాతం నమోదైంది.