Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణంలో ఉచితంగా ఆహారం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆహారం కోసం ప్రత్యేకంగా రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కానీ ఇందుకు ఓ షరతు ఉంది.
మీరు ఎక్కే రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రైలు ఆలస్యం అయితే.. మీకు IRCTC ఉచితంగా ఆహారం అందజేస్తుంది. మీరు ఈ సౌకర్యాన్ని ఆనందంగా, సులభంగా ఆస్వాదించవచ్చు. ఇందుకు రుసుం చెల్లించొద్దు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే IRCTC క్యాటరింగ్ విధానంలో ప్రయాణీకులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందించబడుతుంది.
Also Read
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
Read Also: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే మీరు బుక్ అయినట్లే.. భారీ జరిమానా, జైలు శిక్ష
ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
IRCTC నిబంధనల ప్రకారం.. మీ రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం మీకు అందించబడుతుంది. ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
అల్పాహారం ఏంటి ?
రైలులో అల్పాహారంలో టీ-కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అల్పాహారం, టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లైసులు (గోధుమ/తెలుపు), ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. దీంతో పాటు ప్రయాణికులకు మధ్యాహ్నం రోటీ, పప్పు, కూరగాయలు తదితరాలు ఉచితంగా లభిస్తాయి. మీ రైలు ఆలస్యంగా నడుస్తుంటే నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!