Ashwini Vaishnav : ముంబై లోకల్ రైలులో ప్రయాణించి, రైల్వే ఉద్యోగులతో సెల్ఫీ దిగిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం లక్షలాది మంది ముంబయి వాసులకు జీవనాడి అయిన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో కూడా మాట్లాడుతూ కనిపించారు. రైల్వే మంత్రి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో సబర్బన్ రైలు ఎక్కి 27 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత భాండప్ స్టేషన్లో దిగారు. ఓ అవార్డుల వేడుక కోసం ముంబై వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వైష్ణవ్ అంబర్నాథ్ వెళ్లే స్లో లోకల్ ట్రైన్లోని సెకండ్ క్లాస్ కోచ్లో ఎక్కి భాండూప్ స్టేషన్లో దిగాడు. మంత్రితో సంభాషణ సందర్భంగా.. ప్రయాణీకులు సర్వీసుల సంఖ్యను పెంచాలని కోరారు. రైలు సర్వీసులో తరచుగా అంతరాయాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also:Devara : ఇప్పటివరకు ఓవర్సీస్ లో దేవర క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
రైలులో కేంద్ర మంత్రి వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో రూ.16,240 కోట్లతో 12 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో నెట్వర్క్లోని ట్రాక్ల పొడవు 301 కిలోమీటర్లు పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టులలో CSMT-కుర్లా మధ్య 5వ , 6వ లైన్, ముంబై సెంట్రల్-బోరివలి మధ్య 6వ లైన్, కళ్యాణ్-అసంగావ్ మధ్య 4వ లైన్, కళ్యాణ్-బద్లాపూర్ మధ్య 3వ , 4వ లైను, నీలాజే-కోపర్ డబుల్ తీగ లైన్, నైగావ్-జుయిచంద్ర లైన్ పనులు సాగుతున్నాయన్నారు.
Read Also:Andhra Pradesh: విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. అండగా ఉంటామని హోంమంత్రి హామీ
ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ముంబై లైఫ్లైన్ సామర్థ్యం పెరుగుతుంది. మరిన్ని రైళ్లు నడుస్తాయి. మొత్తం ప్రయాణ అనుభవం మెరుగ్గా ఉంటుంది. వైష్ణవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ను కూడా తనిఖీ చేశారు. రైలు ప్రయాణంలో సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ధరమ్ వీర్ మీనా, ఇతర సీనియర్ అధికారులు వైష్ణవ్ వెంట ఉన్నారు. తనిఖీ సందర్భంగా వైష్ణవ్ శివారు ప్రాంతాన్ని సందర్శించారు. స్టేషన్ మేనేజర్తో పాటు విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. దీంతో పాటు భాందప్ స్టేషన్లో రైల్వే ఉద్యోగులతో సెల్ఫీ దిగారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా వైష్ణవ్ ముంబైలోని గణేష్ మండలాన్ని కూడా సందర్శించబోతున్నట్లు ఒక అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!