Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్పూర్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.
Read Also: Patna: రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ..ఏం జరిగిందంటే?
Also Read
నన్ను దేవుడే పంపించాడంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ మోడీని అడిగితే, నాకేమీ తెలియదు.. నన్ను పంపింది దేవుడే అని చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. మోడీ జీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మానేయండి.. దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దని రాహుల్ గాంధీ తెలిపారు.
Read Also: Ranchi: బార్లో మ్యూజిక్ వివాదం.. డీజేను గన్తో కాల్చి చంపిన వ్యక్తి
దేశంలోని యువతకు ఎంత ఉపాధి కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముందుగా బీహార్ యువతకు చెప్పాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడిన మీరు ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని, మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు. మరోవైపు.. ఆర్జేడీ (RJD) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులెవరూ మోడీ ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడేంతగా ప్రధాని భాష స్థాయి పడిపోయిందని అన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!