Rahul Gandhi: కూలీగా మారిన కాంగ్రెస్ అధినేత.. పొలంలో నాటు వేస్తూ రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ రైతుల మధ్యకు చేరుకున్నారు. శనివారం హర్యానాలోని సోనిపట్లో వరి నాట్లు వేస్తున్న రైతుల మధ్యకు రాహుల్ గాంధీ వెళ్లారు. రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన రాహుల్, వారితో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ వరి నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
हरियाणा के सोनीपत में जब किसानों के मन की बात जानने अचानक उनके खेत मे पहुंचे राहुल गांधी जी..#BharatJodoYatra जारी है 🇮🇳✊ pic.twitter.com/WrsCqUJJh6
— Srinivas BV (@srinivasiyc) July 8, 2023
Read Also:Flexes against Modi: ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ లో ఫ్లెక్సీలు, పోస్టర్లు
శనివారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా హర్యానాలోని సోనిపట్లోని బరోడా గ్రామ సమీపంలో పొలంలో వరి నాట్లు వేసిన రైతులపై అతడి కన్ను పడింది. తన కారు ఆపమని చెప్పి దిగి నేరుగా రైతుల వద్దకు వెళ్లాడు. రాహుల్ని చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత రైతు ట్రాక్టర్ తీసుకుని వరి నాట్లు కోసం పొలాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత రాహుల్ కూడా రైతుల నుంచి వరి నాట్లు వేసే విధానాన్ని అర్థం చేసుకుని స్వయంగా వారితో కలిసి వరి నాట్లు వేశారు. బరోడాతో పాటు మదీనా గ్రామంలోని రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడుపుతూ వరి నాట్లు వేస్తున్న ఫోటోలను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ షేర్ చేశారు. హర్యానాలోని సోనేపట్లో రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రైతుల పొలాల వద్దకు చేరుకుని వారి ఆలోచనలను తెలుసుకునేందుకు శ్రీనివాస్ బీవీ రాశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!