Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాదాపు 181 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అందరూ ఉమ్మడి ప్రకటన చేశారు. దేశంలోని యూనివర్సిటీల్లో నియామకాల విషయంలో కేవలం ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే భర్తీ చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి రాహుల్ గాంధీ మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై దేశంలోని 181 మంది విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలోని యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్లు మెరిట్ ప్రాతిపదికన జరగడం లేదని, ఆర్ఎస్ఎస్ లింకుల ఆధారంగానే రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్లు, ప్రకటనల ద్వారా తెలుసుకున్నాం.
Read Also:Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనపై వైస్-ఛాన్సలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘వైస్-ఛాన్సలర్లను చాలా కఠినమైన, పారదర్శక ప్రక్రియలో నియమిస్తారు. దీని కోసం సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏమిటో చూడవచ్చు. యూనివర్శిటీని ముందుకు తీసుకెళ్ళడానికి తమకు పరిపాలన దక్షత ఉందా.. విద్యార్హతలేంటి.. వృత్తిపరమైన అనుభవం ఉందా అనేవి ఎంపిక ప్రక్రియలో ఇది పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇలాంటి ఊహాజనిత విషయాలు మాట్లాడవద్దని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. వాస్తవాలు లేకుండా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దంటూ సూచించారు.
Read Also:KTR: ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. ఆడోళ్లకు,మగోళ్లకు గొడవ పెట్టారు..
ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం వల్ల విద్యా వాతావరణం చెడిపోతుందని విద్యావేత్తలు అన్నారు. వైస్ ఛాన్సలర్లు ఇలా రాశారు, ‘మేము మెరిటోక్రసీని నమ్ముతాము. ఉన్నత విద్యకు ఇది అవసరం. గత కొన్నేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో పురోగతిని ఉటంకిస్తూ, గత కొన్నేళ్లుగా అద్భుతమైన మార్పు వచ్చిందని వైస్ ఛాన్సలర్లు రాశారు. ఇప్పుడు మన యూనివర్సిటీల గ్లోబల్ ర్యాంకింగ్ మెరుగుపడింది. రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల పరువు తీశారని విద్యావేత్తలు అంటున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలా చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!