Raghuveera Reddy: రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. ఇలా చేస్తే తెలంగాణలో అధికారం పక్కా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghuveera Reddy: తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. బలపడుతోంది.. అధికారంలోకి రావడం గ్యారంటీ అంటున్నారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుంది. కర్ణాటక మాదిరి తెలంగాణాలో ఆరు గ్యారంటీల కార్డులను ఇంటింటికి తీసుకెళ్తే.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు అన్నారు.
Read Also: Kodali Nani: అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు.. కొడాలి నాని సెటైర్లు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ప్రధాని నరేంద్ర మోడీ వంద సార్లు పర్యటించినా.. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజల్లో కాంగ్రెస్ రావాలని బలంగా ఉందన్నారు రఘువీరారెడ్డి.. ఇక, ఏపీ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, వైసీపీ దాగుడు మూతలతో పోలవరం ఆలస్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. 2019 నాటికే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ దేశానికి అవసరం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అవలంభించబోయే వ్యూహాలను ఈ నెల 9న జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి. కాగా, తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో… రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో ఎన్నికల వ్యూహాలపై నిమగ్నమై ఉన్నాయి.. పనిలో పనిగా.. పార్టీల్లో చేరేవారు.. వెళ్లిపోయేవారు.. ఇలా జంపింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!