Site icon NTV Telugu

Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో ఇకపై అమరావతి అభివృద్ధి క్వాంటం వేగంతో ముందుకు సాగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఇక కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని మంత్రి స్పష్టం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైఎండ్ రీసెర్చ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలవబోతుందని అన్నారు.

Read Also: Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నిక

ఇక, క్వాంటమ్ వ్యాలీ ద్వారా నవ్యాంధ్ర యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి వేదికలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రాంప్రసాద్‌ రెడ్డి.. భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. “క్వాంటమ్ అమరావతి – గ్లోబల్ ఆంధ్రప్రదేశ్” నినాదంతో ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా, సమగ్ర అభివృద్ధితో అమరావతిని అంతర్జాతీయ గుర్తింపు పొందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైందని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version