Love marriage tragedy: తిరుపతి జిల్లా పుత్తూరులో హృదయ విదారక ఘటన నెలకొంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా పోలీసుల విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Siraj vs Surya Kumar: బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య.. షాక్ అయిన సిరాజ్
ఇక, కాసేపట్లో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మజ, ఇద్దరు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. భర్త తాగుడుకు బానిసై వేధింపులకు గురి చేయడంతోనే మా చెల్లి చనిపోయిందని పుత్తూరు పోలీసులకు పద్మ అన్న కార్తీక్ ఫిర్యాదు చేయడంతో మృతురాలు భర్త శివశంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: T20 World Cup: “మేము పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు”.. నెదర్లాండ్స్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
అయితే, పద్మ అన్న కార్తీక్ మాట్లాడుతూ.. ఇలాంటి దుస్థితి ఏ అన్నకు రాకూడదని కన్నీరు పెట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత పాప అని చనిపోయాక పిలవాల్సిన దుస్థితి వాడి ( పద్మ భర్త) వల్లా వచ్చింది అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలిపాడు. ఇక, అమెరికా సంబంధం వచ్చినప్పటికీ మమ్మల్ని కాదని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మొదట్లో పద్మజ ప్రేమ పేరుతో వేధించి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలియకుండా మా కుటుంబ సభ్యులు ప్రతి నెలా మా అమ్మమ్మ పెన్షన్ తో పాటు ఇతర డబ్బులను డబ్బులు మా వాళ్లు ఇచ్చేవారని చెప్పాడు. అయితే, అతను బయట లోన్స్, అప్పులు పెద్ద ఎత్తున చేశాడు.. అతను అప్పులు ఎందుకు చేశాడో మాకు అనవసరం.. కానీ, మేము ఎంతో ప్రేమగా చూసుకున్న నా చెల్లెలు అతని వల్ల దూరమైంది అని పద్మ అన్న కార్తీక్ పేర్కొన్నాడు.
