PSL2026: “తొలి రోజే ఇజ్జత్ పాయే”.. గులాబీ రంగులోకి మారిన తెలుపు బంతి.. పాకిస్థాన్ సూపర్ లీగ్పై ట్రోల్స్ వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Super League 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 గురువారం లాహోర్లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు, మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్మెన్ను 69 పరుగుల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ (53) టాప్ స్కోరర్గా నిలిచాడు. హైదరాబాద్ కింగ్స్మెన్ కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఫఖర్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో వింత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో తెలుపు బంతి కాస్త గులాబీ రంగులోకి మారింది. దీనికి కారణం హైదరాబాద్ కింగ్స్మెన్ ఆటగాళ్లు ధరించిన జెర్సీల రంగు బంతికి అంటుకోవడమే అని చెబుతున్నారు. సాధారణంగా బంతిని మెరిపించడానికి ప్లేయర్లు తమ దుస్తులకు రుద్దుతుంటారు. అలా రుద్దినప్పుడు జెర్సీ రంగు బంతికి అంటుకుని అది రంగు మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కింగ్స్మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ఈ విషయాన్ని గమనించి వెంటనే అంపైర్లకు చెప్పడంతో 15 ఓవర్లో బంతిని మార్చారు. ఈ అంశంపై నెటిజన్లు పీఎస్ఎల్ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. “కనీసం క్వాలిటీ టీ షర్టులు కూడా కొనుక్కోలేని వాళ్లు.. మీకెందుకు రా క్రికెట్” అంటూ ఓ నెటిజన్లు ఘాటుగా స్పందించాడు. మొదటి రోజే అందరి ముందు పరువు పోయిందిగా అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశాడు.
READ MORE: Petrol & Diesel Price: ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
మరోవైపు.. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రేక్షకులు లేకుండానే జరుగుతోంది. ESPNcricinfo ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PBC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఇంధన సంక్షోభం కారణంగా తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పౌరులందరినీ కోరారని తెలిపారు. ఈ టోర్నమెంట్ను ఆరు వేదికల నుంచి కేవలం రెండు వేదికలకు కుదించారు. దీంతో ఇప్పుడు అన్ని మ్యాచ్లు లాహోర్, కరాచీలలో జరగనున్నాయి. అంతేకాకుండా, లాహోర్లో జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని రద్దు చేశారు. అందుకే జనాలు ఎక్కువగా రావడం లేదని తెలిపారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!