Heart Attack: గుండెపోటుతో విజయవాడలో ప్రముఖ కార్డియాలజిస్ట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైద్యులైన శ్రీనివాస్ దంపతులు సుదీర్ఘ కాలంగా వైద్యులుగా గుర్తింపు పొందారు.
డాక్టర్ శ్రీనివాస్ గుండె జబ్బుల వైద్యుడిగా కోస్తా జిల్లాల్లో గుర్తింపు పొందారు. కార్డియాక్ సర్జన్గా ఎంతో మందికి చికిత్సలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే వారిని శస్త్ర చికిత్సలతో ప్రాణాలు కాపాడారు. గుండె సమస్యలు తలెత్తే విధానం గురించి రోగులకు అర్థమయ్యేలా వివరించే వారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే ఎంతోమందికి చివరి నిమిషాల్లో ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన విజయవాడ రమేష్ హాస్పటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పొవడం వైద్యుల్ని కలిచి వేసింది.
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
పాతికేళ్లకుపైగా వేలాది మందికి బైపాస్ శస్త్ర చికిత్సలు చేశారు. కోస్తా జిల్లాల్లో హృద్రోగ నిపుణులు పెద్దగా లేని సమయంలో జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధులను గుర్తించి వైద్యాన్ని సూచించేవారు. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారికి బైపాస్ సర్జరీలను సమర్ధవంతంగా నిర్వహించారు. సోమవారం భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో విజయవాడ వచ్చిన ఆయన అర్థరాత్రి దాటాక సైలెంట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయారు.
డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ నగరంలోని గాంధీ నగర్లో సాయంత్రం పూట కార్డియాలజి క్లినిక్ సైతం నిర్వహించే వారు. కోవిడ్ నుంచి సొంత క్లినిక్ నడపడం ఆపేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఫ్రిడ్జిలో వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని హాల్లోకి వెళ్లిన ఆయన చాలా సేపటి వరకు లోపలకు రాలేదు. సైలెంట్ కార్డియాక్ అరెస్ట్కు గురి కావడంతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా సేపటి వరకు డాక్టర్ శ్రీనివాస్ బెడ్రూమ్ లోపలకు రాకపోవడంతో బయటకు వచ్చి చూసిన భార్యకు ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు.
డాక్టర్ శ్రీనివాస్ గుండెపోటుకు గురైనట్టు గుర్తించిన ఆయన సతీమణి వెంటనే సీపీఆర్ చేశారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె నెదర్లాండ్స్ నుంచి బుధవారం వచ్చిన తరు వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
కార్డియాలజిస్ట్గా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది మందికి శ్రీనివాస్ సేవలందించారు. ఆయన కుటుంబంలో పలువురు కార్డియాలజీ నిపుణులు ఉన్నారు. భార్య, అల్లుడు, వియ్యంకులు అంతా వైద్యులే ఉన్నా చివరి వరకు సైలెంట్ స్ట్రోక్ను ఎవరు గుర్తించలేకపోయారు. శ్రీనివాస్ గతంలో రోజుకు గంటపాటు వ్యాయామం చేసే వారని, ప్రస్తుతం రోజూ గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఎటువంటి అలవాట్లు లేని ఆయన రోజుకు 70-80 మంది రోగులను చూసి వైద్యం అందిస్తారు. తనకు ముంచుకొచ్చిన ముప్పును మాత్రం గుర్తించలేకపోయారని సహచర వైద్యులు విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
-
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!