భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ (రూ. 4000 కోట్లు) తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. ఈ సినిమా వెనుక ఉన్న బలమైన ఉద్దేశాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టారు. హాలీవుడ్లో మన భారతీయ సంస్కృతికి ఎప్పుడూ సరైన గుర్తింపు దక్కలేదని, మనల్ని ఎప్పుడూ బాధితులుగానే చూపిస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన చరిత్ర ఎంత గొప్పదో, మన సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పడానికే ఈ డ్రీమ్ ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
Also Read : Jailer2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్?
DNEG అధినేతగా ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన అనుభవంతో, నమిత్ ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే, ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై భారతీయుల ఆత్మగౌరవమని ఆయన పేర్కొన్నారు.
