Kiren Rijiju: ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- నిబంధనల ప్రకారమే చేశామని కిరెన్ రిజిజు వెల్లడి
- సభ ప్రశాంతంగా జరగాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత వ్యక్తిని బీజేపీ అవమానించిందని హస్తం పార్టీ ధ్వజమెత్తింది. అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ను కాకుండా ఒడిశా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎంపిక చేయడంపై ఆరోపణలు గుప్పించింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డయేరియా కట్టడిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Also Read
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
- US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
అయితే కాంగ్రెస్ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఖండించారు. 18వ లోక్సభ తొలి సెషన్ ప్రశాంతంగా జరగాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరిక కూడా ఇదేనన్నారు. ప్రత్యేక సెషన్లో ఎలాంటి చర్చలు ఉండవన్నారు.. కానీ ప్రొటెం స్పీకర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రొటెం స్పీకర్ను నియమించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని.. కానీ నిబంధనల ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: KTR : ‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని ప్రభుత్వం అమలు చేయాలి
సోమవారం నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతా ప్రమాణం స్వీకారం చేస్తారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎంపిక జరగనుంది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. అది గనుక ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని చెబుతోంది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 స్థానాలు గెలుచుకుంది. మిత్ర పక్షాల సపోర్టుతో మోడీ సర్కార్ ఏర్పాటు చేశారు.
#WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "We all want the first session of the 18th Lok Sabha to run peacefully. This is also the wish of Prime Minister Narendra Modi. This is a special… pic.twitter.com/e0qf7PWwPT
— ANI (@ANI) June 21, 2024
తాజావార్తలు
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
-
Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!