Kiren Rijiju: ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- నిబంధనల ప్రకారమే చేశామని కిరెన్ రిజిజు వెల్లడి
- సభ ప్రశాంతంగా జరగాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత వ్యక్తిని బీజేపీ అవమానించిందని హస్తం పార్టీ ధ్వజమెత్తింది. అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ను కాకుండా ఒడిశా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎంపిక చేయడంపై ఆరోపణలు గుప్పించింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డయేరియా కట్టడిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
అయితే కాంగ్రెస్ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఖండించారు. 18వ లోక్సభ తొలి సెషన్ ప్రశాంతంగా జరగాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరిక కూడా ఇదేనన్నారు. ప్రత్యేక సెషన్లో ఎలాంటి చర్చలు ఉండవన్నారు.. కానీ ప్రొటెం స్పీకర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రొటెం స్పీకర్ను నియమించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని.. కానీ నిబంధనల ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: KTR : ‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని ప్రభుత్వం అమలు చేయాలి
సోమవారం నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతా ప్రమాణం స్వీకారం చేస్తారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎంపిక జరగనుంది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. అది గనుక ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని చెబుతోంది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 స్థానాలు గెలుచుకుంది. మిత్ర పక్షాల సపోర్టుతో మోడీ సర్కార్ ఏర్పాటు చేశారు.
#WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "We all want the first session of the 18th Lok Sabha to run peacefully. This is also the wish of Prime Minister Narendra Modi. This is a special… pic.twitter.com/e0qf7PWwPT
— ANI (@ANI) June 21, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!