Kiren Rijiju: ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
- నిబంధనల ప్రకారమే చేశామని కిరెన్ రిజిజు వెల్లడి
- సభ ప్రశాంతంగా జరగాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత వ్యక్తిని బీజేపీ అవమానించిందని హస్తం పార్టీ ధ్వజమెత్తింది. అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ను కాకుండా ఒడిశా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎంపిక చేయడంపై ఆరోపణలు గుప్పించింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డయేరియా కట్టడిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Also Read
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
అయితే కాంగ్రెస్ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఖండించారు. 18వ లోక్సభ తొలి సెషన్ ప్రశాంతంగా జరగాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరిక కూడా ఇదేనన్నారు. ప్రత్యేక సెషన్లో ఎలాంటి చర్చలు ఉండవన్నారు.. కానీ ప్రొటెం స్పీకర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రొటెం స్పీకర్ను నియమించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని.. కానీ నిబంధనల ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: KTR : ‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని ప్రభుత్వం అమలు చేయాలి
సోమవారం నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతా ప్రమాణం స్వీకారం చేస్తారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎంపిక జరగనుంది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. అది గనుక ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని చెబుతోంది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 స్థానాలు గెలుచుకుంది. మిత్ర పక్షాల సపోర్టుతో మోడీ సర్కార్ ఏర్పాటు చేశారు.
#WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "We all want the first session of the 18th Lok Sabha to run peacefully. This is also the wish of Prime Minister Narendra Modi. This is a special… pic.twitter.com/e0qf7PWwPT
— ANI (@ANI) June 21, 2024
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!