Site icon NTV Telugu

Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ

Chanchalguda Prison

Chanchalguda Prison

Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను ఖైదీ బురిడీ కొట్టించాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయిన సుజాయత్ అలీ నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి పరారయ్యాడు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో రెండు నెలల క్రితం సుజాయత్ అలీ అరెస్ట్ అయ్యాడు. రెండు నెలల క్రితం 18 మంది సభ్యులతో కలిపి సుజాయత్ అలీని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా బెయిల్ రాకపోవడంతో జైలు నుంచి పరారీకి స్కెచ్ రెడీ చేసుకున్నాడు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి విడుదలై సుజాయత్ అలీ పరారయ్యాడు.

Read Also: Maoists: మావోయిస్టుల ఘాతుకం.. ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో వ్యక్తి హత్య

సుజాయత్ అలీ కస్టడీ కోసం నార్శింగి పోలీసులు పిటిషన్ వేశారు. మరో కేసులో కస్టడీకి అనుమతించడంతో నార్సింగి పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైలులో లేని సుజాయత్ అలీని కస్టడీకి ఎలా ఇస్తారని చంచల్ గూడ అధికారులు ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. బెయిల్ పత్రాలను తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో అధికారులు కంగుతిన్నారు. సుజాయత్ అలీ రిమాండ్ ఖైదీ పరారీ కావడంతో డబీర్‌పురా పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.

Exit mobile version