Birsa Munda Jayanti: రెండు గిరిజన మ్యూజియంలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా..
  • రెండు గిరిజన మ్యూజియంలను
  • మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు.
Birsa Munda Jayanti

Birsa Munda Jayanti

Birsa Munda Jayanti: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన గిరిజన సమాజానికి ఓ ప్రత్యేక కానుకను అందించనున్నారు. దీని కింద మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ‘గిరిజన స్వాతంత్య్ర సమర’ మ్యూజియంలను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అద్భుతమైన చరిత్ర కలిగిన బిర్సా ముండా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 15 న జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా, జబల్‌పూర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంలను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేస్తారని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

చింద్వారాలోని మ్యూజియమ్‌కు స్థానిక గిరిజన వీరుడు (స్వాతంత్య్ర సమరయోధుడు) బాదల్ భోయ్ పేరు పెట్టారు. జబల్‌ పూర్‌ లోని మ్యూజియంకు రాజా శంకర్ షా, రఘునాథ్ షా పేరు పెట్టారు. బిర్సా ముండా, రాజా శంకర్ షా, రఘునాథ్ షాలతో సహా 25 మంది గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను వివరించే రెండు మ్యూజియంలలోని క్యూరేషన్ పనిని రాష్ట్ర గిరిజన వ్యవహారాల శాఖ చేసింది. మ్యూజియం చుట్టూ గిరిజనుల స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అనేక సుందరమైన, ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. జబల్పూర్ గిరిజన మ్యూజియంలో ఆరు గ్యాలరీలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాణి దుర్గావతికి అంకితం చేయబడింది. ఆమె జీవితం, పాలన, బయటి ఆక్రమణదారులతో పోరాటాన్ని ఎలా చేస్తుందని ప్రదర్శిస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివాసీలు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్‌లో బిర్సా ముండా జయంతి రోజున పలు కార్యక్రమాలు నిర్వహించారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ధార్, షాహదోల్ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా తాము దేవుడిగా ఆరాధించే బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన సంఘాల కళాకారులు తమ సంప్రదాయ కళలను ప్రదర్శించనున్నారు. బిర్సా ముండా జయంతిని జరుపుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తుంది. గిరిజన వర్గాల గొప్ప వారసత్వం, సహకారాన్ని జరుపుకుంటుంది.