PM Modi: రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది
- కురుక్షేత్రలో మోడీ మెగా ర్యాలీ
- హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
- రైతులకు.. సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
READ MORE: DGL : నాలుగేళ్లకు సినిమా అనౌన్స్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్
Also Read
ఉద్యోగులకు అనుకూలమైన బీజేపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. “ఇందులో ఉద్యోగులకు ఫిక్స్డ్ పెన్షన్ గ్యారెంటీ.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్పై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయడంతో విస్తృతంగా స్వాగతించారు. కాంగ్రెస్ రైతులకే కాదు దేశాన్ని కాపాడే సైనికులకు కూడా ద్రోహం చేసింది. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసింది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి సొమ్ము ఒక్క జిల్లాకే పరిమితమైంది. బీజేపీ రాగానే హర్యానాలో అభివృద్ధి మొదలైంది. బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందు హర్యానాలో సగం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండేవి కావని.. కానీ నేడు ఇక్కడ 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.” అని ప్రధాని మోడీ అన్నారు.
READ MORE:Rain Alert: బంగ్లాదేశ్ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
హిమాచల్ ప్రదేశ్ మీ పొరుగున ఉందని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అయితే హిమాచల్ పౌరులెవరూ సంతోషంగా లేరని ప్రధాని మోడీ అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన జీతాల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పీఎం గుర్తు చేశారు. సీఎం, మంత్రులు జీతాలు మానేస్తారంటూ సాకులు చెప్పారని, స్కూళ్లు, కాలేజీలు మూతపడే దశలో ఉన్నాయని, అక్కడి మహిళలకు రూ.1500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నేటికీ వేలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?