PM Modi: రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది
- కురుక్షేత్రలో మోడీ మెగా ర్యాలీ
- హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
- రైతులకు.. సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
READ MORE: DGL : నాలుగేళ్లకు సినిమా అనౌన్స్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ఉద్యోగులకు అనుకూలమైన బీజేపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. “ఇందులో ఉద్యోగులకు ఫిక్స్డ్ పెన్షన్ గ్యారెంటీ.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్పై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయడంతో విస్తృతంగా స్వాగతించారు. కాంగ్రెస్ రైతులకే కాదు దేశాన్ని కాపాడే సైనికులకు కూడా ద్రోహం చేసింది. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసింది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి సొమ్ము ఒక్క జిల్లాకే పరిమితమైంది. బీజేపీ రాగానే హర్యానాలో అభివృద్ధి మొదలైంది. బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందు హర్యానాలో సగం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండేవి కావని.. కానీ నేడు ఇక్కడ 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.” అని ప్రధాని మోడీ అన్నారు.
READ MORE:Rain Alert: బంగ్లాదేశ్ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
హిమాచల్ ప్రదేశ్ మీ పొరుగున ఉందని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అయితే హిమాచల్ పౌరులెవరూ సంతోషంగా లేరని ప్రధాని మోడీ అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన జీతాల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పీఎం గుర్తు చేశారు. సీఎం, మంత్రులు జీతాలు మానేస్తారంటూ సాకులు చెప్పారని, స్కూళ్లు, కాలేజీలు మూతపడే దశలో ఉన్నాయని, అక్కడి మహిళలకు రూ.1500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నేటికీ వేలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!