టీవీఎస్ రైడర్ స్పోర్టీ లుక్, మంచి మైలేజ్ తో బైక్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైకులకు యూత్ లో యమ క్రేజ్ ఉంటుంది. సేల్స్ లో కూడా అదరగొడుతున్నాయి ఈ బైకులు. అయితే టీవీఎస్ రైడర్ 125 బైకులు కొనాలనుకునే వారికి కంపెనీ షాకిచ్చింది. ఈ బైకుల ధరలను భారీగా పెంచింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS, TVS రైడర్ 125 ను 125cc విభాగంలో అందిస్తోంది. TVS ఈ మోటార్ సైకిల్ ధరను పెంచింది, ఇది వెంటనే అమలులోకి వస్తుంది.
Also Read:Father Kills Daughter: వీడింతకు తండ్రేనా.. ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురు హత్య..!
ధర ఎంత పెరిగింది?
నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,250 వరకు పెరిగింది. అయితే, ధరల పెరుగుదల అన్ని వేరియంట్లలో ఒకేలా లేదు. వేర్వేరు వేరియంట్లలో వేర్వేరు ధరల పెరుగుదల ఉంది.
Also Read:Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
ఏ వేరియంట్ ధర ఎంత పెరిగింది?
టీవీఎస్ మోటార్ సైకిల్ డ్రమ్ వేరియంట్ ధర రూ.1250, సింగిల్ సీటు రూ.950, స్ప్లిట్ సీటు రూ.900, ఐగో రూ.900, సూపర్ స్క్వాడ్ రూ.900, ఎస్ఎక్స్ సి డిడి రూ.925, టిఎఫ్ టి డిడి రూ.950 పెరిగాయి. ఈ పెంపు తర్వాత, ఈ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.82,000 కు పెరిగింది. టాప్ వేరియంట్ ధర రూ.97,050 (ఎక్స్-షోరూమ్).
