Shabbir Ali : కామారెడ్డి ప్రజల లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల
- ప్రాణహిత చెవెళ్లా పథకానికి 23.15 కోట్లతో భూసేకరణ ప్రారంభం
- కామారెడ్డి రైతులకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు
- తిమ్మక్ పల్లిలో 1.4 టీఎంసీ పనులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali : కామారెడ్డి జిల్లాలోని మల్టీస్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత-చేవెళ్ల పునరుజ్జీవన దిశగా సాగుతుంది. కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అనంతరం మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రజల జీవనాధారం ఈ ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన, ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో రూ.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్షలో కూడా ప్రాజెక్టు పురోగతిపై చర్చించామని తెలిపారు.
కొండం చెరువు వద్ద ప్రాణహిత ప్రాజెక్టు ప్రాథమికంగా 0.80 టీఎంసీలకు డిజైన్ చేయబడిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దీనిని 3.5 టీఎంసీలకు పెంచారని షబ్బీర్ అలీ వివరించారు. ఇది వల్ల 9 గ్రామాలు , తండాలు ముంపుకు గురవుతాయని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమీక్షలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం అభ్యంతరాలు తెలిపారని వెల్లడించిన షబ్బీర్ అలీ, త్వరలో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో మళ్లీ ఆంథోనీ అల్బనీస్దే విజయం.!
ప్రాజెక్టు పురోగతిలో భాగంగా ప్రభుత్వంస్థాయిలో భూసేకరణకు రూ. 23.15 కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయని షబ్బీర్ అలీ తెలిపారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా 316 ఎకరాల భూసేకరణను చేపట్టనున్నట్లు, మొత్తం 619 మంది రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభం అయిందని పేర్కొన్నారు. తిమ్మక్పల్లి వద్ద 1.4 టీఎంసీల పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తామని, వెంటనే రెండో విడత భూసేకరణ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం ప్రణాళిక ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
Sai Sudharsan: సచిన్ రికార్డు బద్దలు.. ఒక్క డకౌట్ లేకుండా 2000 పరుగులు!
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!