Shabbir Ali : కామారెడ్డి ప్రజల లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల
- ప్రాణహిత చెవెళ్లా పథకానికి 23.15 కోట్లతో భూసేకరణ ప్రారంభం
- కామారెడ్డి రైతులకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు
- తిమ్మక్ పల్లిలో 1.4 టీఎంసీ పనులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali : కామారెడ్డి జిల్లాలోని మల్టీస్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత-చేవెళ్ల పునరుజ్జీవన దిశగా సాగుతుంది. కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అనంతరం మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రజల జీవనాధారం ఈ ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన, ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో రూ.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్షలో కూడా ప్రాజెక్టు పురోగతిపై చర్చించామని తెలిపారు.
కొండం చెరువు వద్ద ప్రాణహిత ప్రాజెక్టు ప్రాథమికంగా 0.80 టీఎంసీలకు డిజైన్ చేయబడిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దీనిని 3.5 టీఎంసీలకు పెంచారని షబ్బీర్ అలీ వివరించారు. ఇది వల్ల 9 గ్రామాలు , తండాలు ముంపుకు గురవుతాయని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమీక్షలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం అభ్యంతరాలు తెలిపారని వెల్లడించిన షబ్బీర్ అలీ, త్వరలో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
Also Read
- Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో మళ్లీ ఆంథోనీ అల్బనీస్దే విజయం.!
ప్రాజెక్టు పురోగతిలో భాగంగా ప్రభుత్వంస్థాయిలో భూసేకరణకు రూ. 23.15 కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయని షబ్బీర్ అలీ తెలిపారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా 316 ఎకరాల భూసేకరణను చేపట్టనున్నట్లు, మొత్తం 619 మంది రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభం అయిందని పేర్కొన్నారు. తిమ్మక్పల్లి వద్ద 1.4 టీఎంసీల పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తామని, వెంటనే రెండో విడత భూసేకరణ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం ప్రణాళిక ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
Sai Sudharsan: సచిన్ రికార్డు బద్దలు.. ఒక్క డకౌట్ లేకుండా 2000 పరుగులు!
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!