Devotional organic farming: ‘మాపల్లె’ వెబ్ సైట్ ఆవిష్కరించిన ప్రకాశ్ రాజ్!
నిజామాబాద్ (ఇందూరు) జిల్లాలోని నర్సింగ్ పల్లిలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులు ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయాన్ని కొంతకాలంగా చేస్తున్నారు. ‘మా పల్లె’ పేరుతో ఓ సంస్థను స్థాపించి, వారందరినీ ఏకీకృతం చేసి ‘దిల్’ రాజు సోదరుడు నరసింహా రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించడంతో పాటుగా ప్రజలకు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ప్రధమ కర్తవ్యంగా ‘మా పల్లె’ సంస్థ కృషి చేస్తోంది. నర్సింగ్ పల్లి లోని తిరుమల ఆలయం కేంద్రంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని తెలియచేసే ‘మా పల్లె’ వెబ్ సైట్ ను ఆదివారం దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేయడంలో మనిషిని మించిన మరో జీవి లేదు. కేవలం తన కోసమే కాకుండా తన తర్వాత తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకృతిని సర్వనాశనం చేయడానికి మనిషి వెనుకాడటంలేదు. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావనతో భూమిని తల్లిగా భావిస్తూ, ప్రకృతిని కాపాడే ఇలాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉంది. రైతులు కూలీలుగా మారుతున్న ఈ దుర్బర పరిస్థితుల్లో వారిలో చైతన్యం తీసుకొచ్చి, ముందుకు నడిపిస్తున్న నరసింహారెడ్డి గారి సంకల్పం గొప్పది. నా వంతుగా ఏ సహాయం కావాలన్నా ఇక్కడి రైతులకు చేస్తాను” అని హామీ ఇచ్చారు. ‘సుభాష్ పాలేకర్ గారి నేతృత్వంలో ఎంతోకాలంగా ప్రకృతి వ్యవసాయాన్ని తాము చేస్తున్నామని, అయితే ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తి దీనికి ప్రచారం చేస్తే మరింతగా అది ప్రజలలోకి వెళుతుంద’ని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ఉద్యమ కారులు విజయ రామ్ అన్నారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
‘మనిషిలో ఆధ్యాత్మిక భావాలను పెంచే దేవాలయం, దాని అనుబంధంగా చక్కని ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం, సమాజం పట్ల బాధ్యతను తెలియచేసే విలువలతో కూడిన ఆలోచనధార లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని, ప్రకాశ్ రాజ్ ను ఓ నటుడిగా అభిమానించడంతో పాటు దానిని మించి ఓ మానవీయ మూర్తిగా తాను గౌరవిస్తానని, ఈ వెబ్ సైట్ ఆయన చేతుల మీద ప్రారంభం కావడం ఆనందంగా ఉంద’ని నరసింహారెడ్డి అన్నారు. తన మాటను మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రకాశ్ రాజ్ కు ‘దిల్’ రాజు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు స్థానిక రైతులతో ప్రకాశ్ రాజ్, విజయ రామ్ ముచ్చటించారు. దేవాలయం సమీపంలోని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని దిల్ రాజుతో కలిసి ప్రకాశ్ రాజ్ సందర్శించారు. అక్కడి వరి పంటలలోని రకాలను గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?