పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం చిన్న విరామం ప్రకటించింది. దర్శకుడు సందీప్ వంగా తదుపరి భారీ షెడ్యూల్ కోసం పక్కా ప్లానింగ్తో సిద్ధమవుతున్నారు.
Also Read : Vijay Rashmika : తారాలోకం దిగివచ్చిన వేళ.. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో రాజకీయ, సినీ ప్రముఖుల సందడి!
కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సందీప్ వంగా టీమ్ కసరత్తు చేస్తోంది. ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన మేకోవర్, యాటిట్యూడ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబేరాయ్, కాంచన వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2027 మార్చి 5న ‘స్పిరిట్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ మార్క్ మాస్.. సందీప్ వంగా మార్క్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.