Site icon NTV Telugu

SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్

Jayasurya

Jayasurya

టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో జయసూర్య ఈ రికార్డును అందుకున్నాడు. రెండో టెస్టు ఐదో రోజు ఆటలో ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టెర్లింగ్ ను అవుట్ చేయడం ద్వారా జయసూర్య 50 వికెట్ల క్లబ్ లో చేరాడు.

Also Read : Vizag Swetha Case: శ్వేత మృతి కేసు.. కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు

టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల క్లబ్ లో చేరిన బౌలర్ గా అరుదైన రికార్డును ప్రభాత్ జయసూర్య సాధించాడు. ఈ క్రమంలో 71 ఏళ్లుగా వెస్టిండీస్ దిగ్గజం ఆల్ఫ్ వాలైంటైన్ పేరిట ఉన్న రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. 50 వికెట్ల క్లబ్ చేరేందుకు జయసూర్యకు కేవలం 7 టెస్టు మ్యాచ్ లు మాత్రమే అవసరం అయ్యాయి. అదే సమయంలో ఆల్ఫ్ ఈ ఘనతను 8వ టెస్టులో సాధించాడు. ఆల్ఫ్ ఈ రికార్డును 1951-52 మధ్య నెలకొల్పాడు.

Also Read : HairFall : శరీరంలో కొవ్వు పెరిగితే జుట్టురాలుతుందా.. నిజమెంత ?

ఇక రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఐదో ఆట లంచ్ విరామానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్సింగ్స్ లో 5 వికెట్లకు 121 పరుగులు చేసింది. ప్రస్తుతం 91పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్సింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్ క్యాంపర్ ( 111 ), పాల్ స్టిర్లింగ్ ( 103 ) సెంచరీలతో కదం తొక్కారు. ఆండీ బాల్ బిర్నీ ( 95 ), టక్కర్ ( 80 ) త్రుటిలో శతకాలను చేజార్చుకున్నారు.

Also Read : మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక తమ తొలి ఇన్సింగ్స్ ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కుశాల్ మెండీస్ ( 245 ), నిశాన్ మదుశంక ( 205 ) డబుల్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే ( 115 ), మ్యాథ్యూస్ ( 100 నాటౌట్ ) శతకాలతో చెలరేగారు. దాంతో శ్రీలంక 212 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.

Exit mobile version