Delhi Diwali Pollution: గడిచిన 8ఏళ్లలో దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Diwali Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రాజధానిలోని ప్రజలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారు. సోమవారం ఉదయం, రాజధాని ఢిల్లీ, ఎన్సిఆర్లో పొగమంచు వాతావరణాన్ని కప్పివేస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం దీపావళి రోజు సాయంత్రం ప్రారంభమైన పటాకుల సందడి రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఇంతలో వివిధ గాలి నాణ్యతను కొలిచే బృందాలు, రాజధాని గాలి నాణ్యతను వారి స్వంత మార్గాల్లో కొలుస్తూ ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించాయి.
గాలి నాణ్యతను కొలిచే స్విస్ గ్రూప్ IQAir డేటా ప్రకారం.. ఢిల్లీ సోమవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది. ఇక్కడ ఉదయం 5:00 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి 514 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. ఈ సమూహం ప్రకారం AQI 320 ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరికలున్నాయి. ఈ బృందం ప్రకారం సోమవారం ఢిల్లీలో గాలి ఈ ప్రమాదకర స్థాయి కంటే దారుణమైన స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యతను కొలిచే మరో వాతావరణ సంస్థ aqicn.org ప్రకారం.. వాయు కాలుష్యం ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యంత దారుణంగా నమోదైంది. ఇక్కడ ఉదయం 5:00 గంటలకు గాలి నాణ్యత సూచిక (AQI) 969, ఇది ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది సాధారణం కంటే 20 రెట్లు ఎక్కువ. ఈ ఏజెన్సీ ప్రకారం AQI 300 కంటే ఎక్కువ చేరుకోవడం చాలా ప్రమాదకరం.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
Read Also: Tiger 3 Crackers: థియేటర్లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ! వీడియో వైరల్
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్లో ఉదయం 5 గంటలకు సగటు AQI పేలవమైన స్థాయిలో 289 ఉండగా, PM2.5 స్థాయి 500కి చేరుకుంది. అదే విధంగా, ఆర్కేపురంలో ఉదయం 5 గంటలకు AQI 281గా ఉంది. ఇక్కడ కూడా PM2.5లో అత్యధిక AQI 500 స్థాయిని తాకింది. నగరంలో PM 2.5 కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 20 రెట్లు ఎక్కువగా నమోదైంది. అయినప్పటికీ, CPCB డేటా ప్రకారం, ఢిల్లీ గాలి నాణ్యత గత ఎనిమిదేళ్లలో అత్యంత దారుణంగా ఉంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు రాజధానిలోకి ట్రక్కులు రాకుండా నిషేధం విధించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళి నాడు రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి గత 8 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటలకు రాజధానిలోని ఆనంద్ విహార్ జిపిసిసి డేటా ప్రకారం, నగరంలో గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) 289 గా ఉంది. ఇది గత 8 సంవత్సరాలలో దీపావళి నాడు కనిష్టంగా ఉంది. గత సంవత్సరం దీపావళి నాడు ఢిల్లీలో AQI 2022లో 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 319, 2016లో 431 నమోదయ్యాయి. నవంబర్ 7న బేరియం కలిగిన పటాకులపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read Also:Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ప్రగ్యా జైస్వాల్..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!