NTV Telugu Site icon

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Elections

Elections

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.

Read Also: Woman Died: ఉప్పల్‌లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లి మహిళ మృతి!

ఏపీలో కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఈ సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.