Lok sabha election: ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు

S 2

S 2

దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68  శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆరో విడత మే 25న జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: AP Violence: మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడులు.. కౌంటింగ్ లోపు మరో సిట్ నివేదిక

ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఓటేశారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, తమన్నా, షారూఖ్‌ఖాన్ కుటుంబ సభ్యులు, సల్మాన్‌ఖాన్, సారా అలీ ఖాన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇక సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఐశ్వర్యరాయ్‌ చేతికి ఏదో గాయం అయినట్లుగా కనిపించింది. ఆమె బాండేజ్  వేసుకుని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు.