Double Murder: జంట హత్యల కేసుపై పోలీసులు సంచలన విషయాలు..
- నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసు అప్డేట్
- ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు
- మృతుడు మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్ గా గుర్తింపు
- మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్గా గుర్తించారు. నానక్రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటు్న అంకిత్ సాకేత్.. హౌజ్ కీపింగ్గా పని చేస్తున్నాడు. మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో బైక్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ట్రేస్ అవుట్ అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు 30 నుండి 32 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. మహిళ వివరాలను పోలీసులు సేకరించారు. మృతురాలు బిందు (25) చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన మహిళాగా గుర్తించారు పోలీసులు. అంకిత్ సాకేత్తో సన్నిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈనెల 8వ తేదీన మృతుడు అంకిత్ ఎల్బీ నగర్ నుంచి నానక్రామ్ గూడకు తీసుకొచ్చి స్నేహితురాలి గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. 11వ తేదీ రాత్రి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
Also Read
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
పుప్పాల్గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు కలకలం రేపుతుంది. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగిరేస్తుండగా.. అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి వెళ్లిన యువకులు అక్కడ రెండు మృతదేహాలను చూసి భయంతో వణికిపోయారు. యువకులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పరుగులు పెట్టి 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.
Read Also: CM Chandrababu: ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..
తాజావార్తలు
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
-
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
ట్రెండింగ్
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత