TSPSC Paper Leak Case: ముగ్గురు నిందితులకు కస్టడీ.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ స్టేట్మెంట్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ లీకేజీ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది, ముగ్గురు నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలకు 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరినప్పటికీ.. న్యాయస్థానం 3 రోజులకు అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యా, రాజేశ్వర్ నాయక్ నుంచి ప్రశాంత్, రాజేందర్ ఏఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. తిరుపతయ్య దళారిగా వ్యవహరించి ఏఈ ప్రశ్నాపత్రం విక్రయించినట్లు తేలింది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీలో మరికొంత సమాచారం వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రశాంత్, రాజేందర్ ఇంకవెరికైనా ప్రశ్నాపత్రాలను విక్రయించారా అనే కోణంలో ప్రశ్నించనున్నారు.
Read Also: Bhatti Vikramarka: కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదు?
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ను విచారించిన అనంతరం మొత్తం సీనే మారిపోయింది. ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్స్ టీఎస్పీఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని, ఆయన కంప్యూటర్లో మాత్రమే నిక్షిప్తం అవుతాయని, బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదంటూ అనితా రామచంద్రన్ ఇచ్చిన స్టేట్మెంట్తో సిట్ ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిరిగింది. అవసరమైతే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ను కూడా విచారిస్తామన్న సిట్ చేసి చూపించింది. రెండుగంటలపాటు ఛైర్మన్ జనార్ధన్రెడ్డిని ప్రశ్నించి స్టే్ట్మెంట్ రికార్డు చేసింది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటిని భద్రపర్చడం, ఎగ్జామ్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్లో మీ పాత్ర ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఛైర్మన్ అనేక ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు సిటి అధికారులు. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బృందం… నేరుగా ఛైర్మన్ గదికి వెళ్లారు. దాదాపు 3 గంటల పాటు జనార్దన్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. టీఎస్పీఎస్సీ కార్యకలాపాలు, ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రశ్నాపత్రాలు రూపొందించే విధానం, వాటిని భద్రపరిచే తీరు, పరీక్షల నిర్వహణ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత నెల 11వ తేదీన లీకైన ప్రశ్నాపత్రాలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి జనార్దన్ రెడ్డి చెప్పిన వివరాలను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇదివరకే టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి వాంగ్మూలాలను సిట్ అధికారులు ఇది వరకే నమోదు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!