Car Theft : కారు కనిపిస్తే ఖతం.. చోరులందు వీరు వేరయా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police arrested Cars Robbery Gang.
ఖరీదైన కార్లు వారి టార్గెట్ .. పార్క్ చేసిన కార్లు దొంగలించడం వాటిని దేశ రాజధాని దాటించి తెలంగాణ లో అమ్మేయడం .. అలా వచ్చిన లాభం లో తలాఇంత అని పంచుకొవడం ఇది ఈ ముఠా చేస్తున్న దందా .. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ముగ్గరు నిందితులను అరెస్ట్ చేశారు.. ఢిల్లో లో చోరీ చేసిన 15 కార్లను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు .. కార్లు ను చోరీ చేసి హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశారు సైబరాబాద్ పోలీసులు . హైదరాబాద్ బండ్లగూడ , అత్తాపూర్ కి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు చోరీ అయినా కారులు అమ్మకాలు చేస్తున్నారు. మహ్మద్ అజహర్ జావీద్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదివి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. దీంతో ఖత్తర్ లో వారి సోదరి సహాయంతో అక్కడ రెస్టారెంట్ స్టోర్ లో పని చేశాడు.. అక్కడ పని నచ్చకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత జావీద్ ఉద్యోగం కోసం వెతికాడు.. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు .. దీంతో సెకెండ్ హ్యాండిల్ లో కారులు కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తే డబ్బులు వస్తాయని భావించి ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశారు. దీంతో జావీద్ కి ఉత్తర ప్రదేశ్ కి చెందిన గులాం నబి పరిచయం అయ్యాడు. జావీద్ అడిగినట్లుగానే రెండు వాహనాలు సెకెండ్స్ లో నబి తక్కువ రేటుకు ఇన్నోవా కారు నాలుగు లక్షలకు అమ్మేశాడు .. దీంతో ఆ ఇన్నోవా కారును 6 లక్షల 70 వేలు కు సెల్ చేశాడు.. దీంతో ఇనోవా కారు సేల్ చేయగా రూ. 2,70,000 ఆదాయం వచ్చింది. దీంతో నబి కి జావీద్ కు మధ్య పరిచయం ఏర్పడింది.
Also Read
- ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
నా దగ్గర ఖరీదైన ఫార్చూనర్ కారు ఉందని అతి తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి జావీద్ కి గులాం నబి 2 లక్షలు అమ్మకాలు చేశాడు.. బ్యాంకు అధికారులు పెట్టిన ఆక్షన్ లో వచ్చిన కారును కొనుగోలు చేశానని నమ్మించాడు. అయితే కారు ఎన్ఓసీ కానీ, కారు కి సంబంధించిన పేపర్లు అడగటంతో గులాం నబి నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో ఎదో ఒక్క రోజు అసలు నిజం చెప్పాలని భావించి గులాం నబి వాస్తవం చెప్పాడు. నేను దొంగలించిన కారును మీకు అమ్మకం చేశానని, నకిలీ ఎన్ఓసీ, కారు డాక్యుమెంట్లు సృష్టియించి వేరే వారికి అమ్మేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇలా రెండు లక్షలు ఫార్చ్యూనర్ కారును 6.5 లక్షలకు అమ్మేశాడు.
ఇలా పదుల సంఖ్యలో దొంగలించిన కారులు ను ఢిల్లీ లోని నబి ద్వారా జావీద్ అతనికి సహాయంగా మహమ్మద్ జహీర్ , అమన్ ఖాన్ ను తీసుకెళ్లి దొంగలించిన కార్లు హైదరాబాద్ లో అమ్మేస్తున్నారు.
ఇలా ఢిల్లీ నుండి దొంగలించబడిన కార్లను బ్యాంకు అధికారులు వేసిన వేలం పాటలో కొనుగోలు చేశామని చెప్పి అమ్మకాలు చేస్తూ మోసం చేస్తుంది ముఠా. కొంత మందికి ఎన్ఓసీలు ఇవ్వక పోవడం, అలాగే డాక్యుమెంట్లు అడిగితే ఎదో ఒక సమాధానం చెప్పి దాటవేయడం, ఇంకా ఎక్కువ ఒత్తిడి పెడితే నంబర్స్ ను మార్చేస్తూ ఇలా మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక వీరి వద్ద కొనుగోలు చేసిన వారు ఇది దొంగ వాహనం అని తెలుసుకొని భయపడుతూ, బయటకి చెపితే ఏమవుతుందో అని అలాగే వాహనాలు పెట్టుకొని తిరుగుతున్నట్లు తేలింది. దీంతో సైబరాబాద్ లోని శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడులు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా అసలు వాస్తవం బయట పడింది. ఢిల్లీ లో 16 ఎఫ్ఐఆర్లు నమోదయినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముగ్గరు నిందితులు నుండి 15 కార్లు ను సీజ్ చేశారు. అందులో ఇనోవా 2 , క్రెటా 4, బెలెనొ 7, బ్రిజ 2 కార్లు ను సీజ్ చేశారు పోలీసులు .. నిందితులు నలుగురు కూడా వచ్చిన ఆదాయంలో పంచుకుంటున్నారని తెలిపారు. పరారీ లో ఉన్న కీలక నిందితుడు గులాం నబి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
-
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
-
Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..