PoK Protests: పీఓకేలో అదుపుతప్పిన పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పాలకులు ఇంటర్నెట్ను నిలిపి వేయడంతో పాటు అన్ని రవాణా మార్గాలను బంద్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి జనం సోమవారం నుంచి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపగా.. ఇందులో ఇద్దరు స్థానిక పౌరులు మరణించారు. అయినా కూడా ఈ నిరసనలు మాత్రం ఆగలేదు. ఇంతకీ అక్కడ అసలు ఏం జరుగుతుంది..
READ ALSO: SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఈ ఛార్జీలు పెంపు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
స్వదేశ పౌరులను విస్మరిస్తున్న పాక్ హైకమాండ్..
షాబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ప్రపంచ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు కానీ స్వదేశంలో పౌరులను పట్టించుకోవడం లేదనే వాదనలు అక్కడి ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శాంతిని బోధించే పాకిస్థాన్ ఇప్పుడు తన సొంత ప్రజలపైనే కాల్పులు జరుపుతోందని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పీఓకేలోని ప్రజలు అక్కడి ప్రభుత్వం నుంచి తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ ప్రభుత్వం ముందు 38 డిమాండ్లను ఉంచింది. అధికారంలో ఉన్నవారికి ప్రత్యేక హక్కులను రద్దు చేయడం, కాశ్మీరీ వలసదారులకు రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లను తొలగించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. JKJAAC సోమవారం నుంచి నిరవధిక లాక్డౌన్ ప్రకటించింది. ఇదే సమయంలో పీఓకేలో అనేక ప్రదేశాలలో నిరసనలు నిర్వహించింది. ఈక్రమంలో రాజధాని ముజఫరాబాద్లో JKJAAC – ISI-మద్దతుగల ముస్లిం కాన్ఫరెన్స్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈసందర్భంగా అవామీ యాక్షన్ కమిటీ చీఫ్ షౌకత్ నవాజ్ మీర్ మాట్లాడుతూ.. నిరసనలు, సమ్మెలను అణిచివేసేందుకు చేసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే పాక్లోని ప్రధాన మీడియా సంస్థలు ఈ నిరసనలను వారి ఛానల్స్లో ప్రసారం చేయకుండా దూరంగా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!