కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై సురేఖ కొలచెల నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం “పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ”. యతీంద్ర, రమ్య దినేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏ. ఫణీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భక్తిరసంతో కూడిన టైటిల్ ఉన్నప్పటికీ, ఇది ఒక ఉత్కంఠభరితమైన ‘కామెడీ డ్రామా ప్లస్ థ్రిల్లర్’ అని చిత్ర యూనిట్ పేర్కొనడం విశేషం. ఈ సినిమా గురించి దర్శకుడు మరియు చిత్ర బృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా ఒకే ఒక్క రాత్రి సమయంలో, ఒక హాస్పిటల్ నేపథ్యంలో సాగే కథ ఇది. హీరో యతీంద్ర ఇందులో ఒక విభిన్నమైన బ్రాహ్మణ గెటప్లో కనిపిస్తారని సమాచారం. మోషన్ పోస్టర్లో చూపిస్తున్న విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
Also Read:Dhurandhar 2: దురంధర్ 2 ఊచకోత.. ఇండియాలోనే మొదటి సినిమాగా కొత్త రికార్డ్
సినిమా చిత్రీకరణకు సంబంధించి కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత కోనసీమ అందాలకు నిలయమైన అమలాపురం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించనున్నారు. కేవలం 40 రోజుల్లోనే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రానికి సురేష్ రగుటు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, అవినాష్ కురుమానా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రశాంత్ తేజ ఎడిటర్గా, పవన్ కుమార్ తమ్మినేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్తదనంతో కూడిన కథలు కోరుకునే ప్రేక్షకులకు ఈ “పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.