Pocharam Srinivas Reddy : ప్రభుత్వం హామీల అమలులో కాలయాపన చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం హామీల అమలు లో కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఆయన అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయన్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెట్టారని, చేయూత ,రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేదని దరఖాస్తులు తీసుకున్నారని ఆయన అన్నారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని, మొత్తానికి ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరి తో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేదాకా కాల యాపన చేసి ఏడాది దాకా హామీలను ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తోందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని, కాంగ్రెస్ లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారని ప్రశ్నించారు. కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని అప్పుడే విజయం అధ్యమన్నారు. పార్టీ లో ప్రక్షాళన జరగాలన్నారు. కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సమీక్షలు తప్ప ఫలితాలు లేవన్నారు. గృహలక్ష్మి పథకం రద్దు చేశారు ..మరి ఎంపిక చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరే హామీ అమలు కావడం లేదని, రైతు బంధు ఎవరికీ సరిగ్గా అందలేదు, రైతు రుణమాఫీ గురించి ఊసే లేదని, వడ్లకు బోనస్ ఏది అని ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..