NTV Telugu Site icon

Mann Ki Baat: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’పై ప్రత్యేక పుస్తకం.. రాష్ట్రపతికి అందజేత

New Project (26)

New Project (26)

Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోడీపై రాసిన “ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్@100” పుస్తకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఈ పుస్తకాన్ని అందుకున్నారు. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసి వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురించిన ఈ పుస్తకం ప్రధాని నరేంద్ర మోడీ రేడియో షో ఆధారంగా రూపొందించబడింది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా, తన బృందం సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకం ప్రత్యేకత సంతరించుకుంది, ఎందుకంటే ఇందులో ప్రధాని మోడీ స్వయంగా రాసిన ప్రత్యేక ముందుమాట కూడా ఉంది. 100వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారమైంది. ఈ కార్యక్రమం అక్టోబర్‌లో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది.

Read Also:Tammineni Veerabhadram: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు..

Read Also:DK Shivakumar: కాంగ్రెస్ వేవ్ ఉంది.. తెలంగాణలో గెలుస్తుంది.. మరల ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది..!

మన్ కీ బాత్ తనకు కేవలం ఒక కార్యక్రమం మాత్రమేనని ప్రధాని మోడీ చెప్పారు. తన రేడియో కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చెందిన వ్యక్తుల కథలను చేర్చారు. వారు సమాజానికి ఏదో ఒక విధంగా మార్పు తెచ్చారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ద్వారా రేడియోను పునరుద్ధరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. పీఎం తన బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌పై వ్రాసిన పుస్తకంపై కూడా వ్యాఖ్యానించారు. “ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100” దేశం సామర్థ్యాన్ని, స్ఫూర్తిని, ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సామూహిక మంచితనానికి గల శక్తిని ఉదాహరణగా చూపుతుందని ఆయన అన్నారు.