PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఢిల్లీ-మీరట్ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణాన్ని అత్యంత వేగవంతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు నమో భారత్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మీరట్లో రూ. 12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
- Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ఢిల్లీ నుండి మీరట్ మధ్య దూరం సుమారు 82 కిలోమీటర్లు. గతంలో ఈ దూరం ప్రయాణించడానికి 3 నుండి 3.5 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ కారిడార్ వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. నమో భారత్ (RRTS) గంటకు 180 కి.మీ డిజైన్ వేగంతో నడిచే ఈ రైలు దేశంలోనే మొదటి రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్ మరియు మీరట్ వంటి పట్టణాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానిస్తుంది. అలాగే మీరట్ మెట్రో రైలు గంటకు 120 కి.మీ ఆపరేషనల్ వేగంతో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలుస్తుంది.
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి మీరట్లోని మోదీపురం, బేగంపూర్ లేదా శతాబ్ది నగర్ వంటి ప్రాంతాలకు కేవలం ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఢిల్లీలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో, ఉద్యోగులు మీరట్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్లను అద్దెకు తీసుకుని మెట్రో ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల ప్రయాణ సమయం తగ్గి, ఉద్యోగులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. ఇంకా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఢిల్లీ-మీరట్ మధ్య రోజూవారీ ప్రయాణాన్ని శ్రమ లేకుండా ఇంకా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
#WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi flags off Meerut Metro and Namo Bharat Train at Shatabdi Nagar Namo Bharat Station.
From here, PM Modi will undertake a Metro Ride till Meerut South Station. Later, the Prime Minister will inaugurate and dedicate to… pic.twitter.com/uYw8pxetwD
— ANI (@ANI) February 22, 2026
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!