Site icon NTV Telugu

PM Modi: పార్లమెంట్‌లో నీలిరంగు జాకెట్‌ ధరించిన ప్రధాని.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Pm Modi

Pm Modi

PM Modi: వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్తను ఏరిపారేస్తూ కనిపించారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రత్యేకమైన నీలిరంగు జాకెట్‌లో కనిపించారు. ఆయన పార్లమెంట్‌లో ధరించిన నీలిరంగు జాకెట్ ప్రత్యేకమైనది ఎందుకంటే అది రీసైకిల్ చేయబడిన పెట్‌ బాటిళ్లతో తయారు చేయబడింది.

బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని మోదీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ జాకెట్‌ను బహుకరించింది. ఐవోసీ ఉద్యోగులు, సాయుధ దళాల కోసం స్థిరమైన వస్త్రాలను తయారు చేయడానికి 10 కోట్ల కంటే ఎక్కువ పెట్‌ బాటిళ్లు రీసైకిల్ చేయబడతాయి. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సమర్పించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి రీసైకిల్ చేసిన ప్రత్యేక నీలిరంగు జాకెట్‌లో కనిపించారు.

strange marriage: బ్యాండ్ బాజా మోగింది.. చిలుక పెళ్లి అయింది!

ఇటీవల ప్రభుత్వం రూ.19,700 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది. ఇది ఆర్థిక వ్యవస్థను తక్కువ కార్బన్ తీవ్రతకు మార్చడానికి, శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఈ రంగంలో సాంకేతికత, మార్కెట్ నాయకత్వాన్ని దేశం స్వీకరించేలా చేస్తుంది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన, నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ.35,000 కోట్లను అందించారు. ప్రభుత్వం ఏడు ప్రాధాన్యతలలో గ్రీన్‌ ఎనర్జీని జాబితా చేశారు.

 

Exit mobile version