PM Modi: ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఢిల్లీ యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో కాకుండా మెట్రోలో ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
Also Read: France: ఫ్రాన్స్లో ఆగని అల్లర్లు.. పారిస్ శివారులో కర్ఫ్యూ విధింపు
ప్రధాని మోదీ గతంలో అమెరికా, ఈజిప్ట్లో పర్యటించి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మధ్యప్రదేశ్లో పర్యటించారు. అక్కడ వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు.
ప్రయాణికులతో సంభాషించిన ప్రధాని
ఢిల్లీ యూనివర్శిటీకి తన మెట్రో ప్రయాణంలో, ప్రధాని మోదీ సాధారణ ప్రయాణికులతో కూడా సంభాషించడం కనిపించింది. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రజలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రయాణికులతో సంభాషిస్తున్న సమయంలో అక్కడి వారితో కలిసి నవ్వుతూ కూడా కనిపించారు. మెట్రోలో యువతతో మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు.
#WATCH | Prime Minister Narendra Modi travels in Delhi metro to attend the centenary celebrations of Delhi University. pic.twitter.com/s7r3DRSEba
— ANI (@ANI) June 30, 2023
