CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Price Hike: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారత్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. శనివారం మరోసారి ఇంధన ధరలను పెంచడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరగగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. అలాగే సీఎన్జీ ధరను కిలోకు రూ.1 పెంచారు. గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఇంతకుముందు మే 15న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను ఒక్కోటి రూ.3 చొప్పున పెంచారు. ఆ తర్వాత మే 19న కూడా పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు వడ్డించారు.. తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.5 వరకు పెరిగాయి. సీఎన్జీ ధర కూడా రెండోసారి పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.64 నుంచి రూ.99.51కి చేరుకుంది. డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ.92.49కు పెరిగింది. ఇక సీఎన్జీ ధర కిలోకు రూ.81.09గా నమోదైంది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని సూచించింది. ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలిక రద్దీ కనిపిస్తున్నప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా ఖర్చులపై పడే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!