Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఉదయం పవర్ పెట్రోల్ పై 2 రూపాయల 26 పైసలు ధర పెరిగిందని వెల్లడించారు.. ఇంచుమించు నార్మల్ పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పెరుగుతుంది అనేది మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. డాలర్ రేటు పెరిగింది, బ్యారేల్ ధర కూడా పెరిగి ప్రభుత్వంపైన భారం పడే అవకాశం ఉందన్నారు.. కాబట్టి ధరలు పెరుగుతాయని మేము ఒక అంచనాకు వచ్చామన్నారు..
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
Also Read
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
గడిచిన రెండు మూడేళ్ళలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని అమరేందర్ రెడ్డి వెల్లడించారు.. “ఇప్పుడు కూడా డైరెక్ట్గా 10 రూపాయలు పెరగకపోవచ్చు.. గతంలో 2022లో దీపావళికి ఎక్కువ స్టాక్ పెట్టినప్పుడు డిమాండ్ పెరిగింది.. అప్పుడు ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేసాయి.. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ డ్యూస్ తో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40 శాతం పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి.. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డిలీర్లకు సాధ్యం కాదు. గతంలో ఆయిల్ కంపెనీలు అడగకున్న ఫోర్స్ గా క్రెడిట్ ఇచ్చే వారు.. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వసూల్ చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ దొరకదేమో అనే భయంతో 100 రూపాయలు పోసుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో పోసుకోవడం కూడా ఈ కొరత కు కారణం అవుతుంది. పెట్రోల్ వినియోగం పై ప్రజలకు ప్రభుత్వం అవగాహనా కల్పిస్తే ఈ షార్టేజ్ ను కొంతమేర తగ్గించవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్లకు కూడా డిమాండ్ కు సరిపడా స్టాక్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేక పోతున్నారు.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..