Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఉదయం పవర్ పెట్రోల్ పై 2 రూపాయల 26 పైసలు ధర పెరిగిందని వెల్లడించారు.. ఇంచుమించు నార్మల్ పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పెరుగుతుంది అనేది మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. డాలర్ రేటు పెరిగింది, బ్యారేల్ ధర కూడా పెరిగి ప్రభుత్వంపైన భారం పడే అవకాశం ఉందన్నారు.. కాబట్టి ధరలు పెరుగుతాయని మేము ఒక అంచనాకు వచ్చామన్నారు..
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
Also Read
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
గడిచిన రెండు మూడేళ్ళలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని అమరేందర్ రెడ్డి వెల్లడించారు.. “ఇప్పుడు కూడా డైరెక్ట్గా 10 రూపాయలు పెరగకపోవచ్చు.. గతంలో 2022లో దీపావళికి ఎక్కువ స్టాక్ పెట్టినప్పుడు డిమాండ్ పెరిగింది.. అప్పుడు ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేసాయి.. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ డ్యూస్ తో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40 శాతం పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి.. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డిలీర్లకు సాధ్యం కాదు. గతంలో ఆయిల్ కంపెనీలు అడగకున్న ఫోర్స్ గా క్రెడిట్ ఇచ్చే వారు.. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వసూల్ చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ దొరకదేమో అనే భయంతో 100 రూపాయలు పోసుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో పోసుకోవడం కూడా ఈ కొరత కు కారణం అవుతుంది. పెట్రోల్ వినియోగం పై ప్రజలకు ప్రభుత్వం అవగాహనా కల్పిస్తే ఈ షార్టేజ్ ను కొంతమేర తగ్గించవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్లకు కూడా డిమాండ్ కు సరిపడా స్టాక్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేక పోతున్నారు.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!