Pest Control Tips In Guava: జామలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి దీని ఉద్ధృతిని తగ్గించవచ్చు. దీన్ని రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు..
ఇందుకోసం మిథైల్ యూజినాల్ 2మి.లీ మరియు మలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ద్రావణం తయారు చేయాలి.. ఇందులో ఫ్లైవుడ్ మొక్కలను నానబెట్టి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టి తోటల్లో అమర్చడం వల్ల పండు ఈగ ఉద్ధృతి తగ్గుతుంది. ప్లైవుడ్ మొక్కలను ప్లాస్టిక్ సీసాలో దారంతో వేలాడదీసిన సీసా అడుగున పులిసిన గంజిని ఉంచితే పండు ఈగ నుంచి నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు..ఇక ఈ ఈగ ఉదృతి మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి, 5మి.లీ మలాథియన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటల్లో అమర్చి కూడా ఈగ తీవ్రతను తగ్గించవచ్చనని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
తెల్లసుడి దోమలు.. ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకు రాత్రి సమయాల్లో జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి.. అప్పుడే ఈగల బెడద పూర్తిగా తగ్గుతుంది..
పిండినల్లి..చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసితెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు బదనికలు తోటలో విడుదల చేయాలి..
కాండం తొలిచే పురుగులు.. పురుగు చెట్ల మొదళ్లలోకి తొలుచుకుని పోయి విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. కాబట్టి, రంధ్రాలను శుభ్రపరచి పురుగులను చంపాలి. ఆ తర్వాత రంధ్రాల్లో పెట్రోల్ లేదా కిరోసిన్ లో తడిపిన దూదిని ఉంచి తడి మట్టిని పెట్టాలి అప్పుడే పురుగులు నశిస్తాయి..
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!