Pest Control Tips In Guava: జామలో తెగుళ్ల నివారణ చర్యలు..
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి దీని ఉద్ధృతిని తగ్గించవచ్చు. దీన్ని రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు..
ఇందుకోసం మిథైల్ యూజినాల్ 2మి.లీ మరియు మలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ద్రావణం తయారు చేయాలి.. ఇందులో ఫ్లైవుడ్ మొక్కలను నానబెట్టి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టి తోటల్లో అమర్చడం వల్ల పండు ఈగ ఉద్ధృతి తగ్గుతుంది. ప్లైవుడ్ మొక్కలను ప్లాస్టిక్ సీసాలో దారంతో వేలాడదీసిన సీసా అడుగున పులిసిన గంజిని ఉంచితే పండు ఈగ నుంచి నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు..ఇక ఈ ఈగ ఉదృతి మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి, 5మి.లీ మలాథియన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటల్లో అమర్చి కూడా ఈగ తీవ్రతను తగ్గించవచ్చనని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
తెల్లసుడి దోమలు.. ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకు రాత్రి సమయాల్లో జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి.. అప్పుడే ఈగల బెడద పూర్తిగా తగ్గుతుంది..
పిండినల్లి..చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసితెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు బదనికలు తోటలో విడుదల చేయాలి..
కాండం తొలిచే పురుగులు.. పురుగు చెట్ల మొదళ్లలోకి తొలుచుకుని పోయి విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. కాబట్టి, రంధ్రాలను శుభ్రపరచి పురుగులను చంపాలి. ఆ తర్వాత రంధ్రాల్లో పెట్రోల్ లేదా కిరోసిన్ లో తడిపిన దూదిని ఉంచి తడి మట్టిని పెట్టాలి అప్పుడే పురుగులు నశిస్తాయి..
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!