Pest Control Tips In Guava: జామలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి దీని ఉద్ధృతిని తగ్గించవచ్చు. దీన్ని రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు..
ఇందుకోసం మిథైల్ యూజినాల్ 2మి.లీ మరియు మలాథియాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ద్రావణం తయారు చేయాలి.. ఇందులో ఫ్లైవుడ్ మొక్కలను నానబెట్టి ప్లాస్టిక్ సీసాల్లో పెట్టి తోటల్లో అమర్చడం వల్ల పండు ఈగ ఉద్ధృతి తగ్గుతుంది. ప్లైవుడ్ మొక్కలను ప్లాస్టిక్ సీసాలో దారంతో వేలాడదీసిన సీసా అడుగున పులిసిన గంజిని ఉంచితే పండు ఈగ నుంచి నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు..ఇక ఈ ఈగ ఉదృతి మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 100గ్రా. బెల్లం లేదా పులిసిన గంజి, 5మి.లీ మలాథియన్ కలిపి మట్టి పాత్రల్లో పోసి తోటల్లో అమర్చి కూడా ఈగ తీవ్రతను తగ్గించవచ్చనని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
తెల్లసుడి దోమలు.. ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. దీని నివారణకు రాత్రి సమయాల్లో జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి.. అప్పుడే ఈగల బెడద పూర్తిగా తగ్గుతుంది..
పిండినల్లి..చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసితెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు బదనికలు తోటలో విడుదల చేయాలి..
కాండం తొలిచే పురుగులు.. పురుగు చెట్ల మొదళ్లలోకి తొలుచుకుని పోయి విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. కాబట్టి, రంధ్రాలను శుభ్రపరచి పురుగులను చంపాలి. ఆ తర్వాత రంధ్రాల్లో పెట్రోల్ లేదా కిరోసిన్ లో తడిపిన దూదిని ఉంచి తడి మట్టిని పెట్టాలి అప్పుడే పురుగులు నశిస్తాయి..
తాజావార్తలు
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!