Karnataka: ఉచిత బస్సు సర్వీసులతో ఆటోలు ఎక్కని జనాలు. మా పరిస్థితి ఏంటంటున్న ఆటో డ్రైవర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ప్రభుత్వ పథకాలు కొందరికి మేలు చేసేలా ఉంటే.. మరికొందరికి నష్టాన్ని చేకూర్చులే ఉన్నాయి. అదే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అక్కడ ఆటో డ్రైవర్ల విషయంలో ఇదే జరుగుతోంది. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇచ్చిన హామీ మేరకు శక్తి యోజనను అమలు చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది. మహిళలు తమ ప్రయాణాల కోసం ఉచిత బస్సు సర్వీసును అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారు.
Read Also: Nikhil Siddhartha: నన్ను డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ బస్సులు దాదాపు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా.. బస్సుల్లో మహిళలకే ఫ్రీగా ఉండటంతో.. మగవారికి సీట్లు దొరకడం లేవు. మరోవైపు కర్ణాటకలో ఆటోవాలాల పరిస్థితి దీనంగా మారిపోయింది. ఆటోలో ఎక్కే జనాలు లేక డ్రైవర్లు.. రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా తమ ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండంటంతో అందరు.. బస్సు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారని.. దాంతో సంపాదన ఆగిపోయిందంటూ ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు. రోజంతా ఒక్కరు కూడా ఆటో ఎక్కడం లేదని.. కనీసం రోజుకు రూ.100 కూడా సంపాదించని పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు.
Read Also: Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు
కర్ణాటకలో మినీ ముంబైగా పిలిచే హుబ్లీ నగరం నిత్యం రోడ్లపై రద్దీ ఉంటుంది. ఈ నగరం వాణిజ్యపరమైనది కావడంతో.. ప్రతిరోజు లక్షలాది మంది ఇక్కడికి షాపింగ్ కోసం వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల సంపాదన బాగానే ఉండేది. అయితే ఇప్పుడు వారికి ఆదాయం లేదు.. దీంతో వారు రోడ్డెక్కారు. తమ దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. పని లేకుండా రోజు గడపడం కూడా కష్టంగా మారుతోందని.. గత 12 రోజులుగా ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కలేదని వాపోతున్నారు.
Read Also: Shabbir Ali: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి
హుబ్లీ ధార్వాడలో సుమారు 25 వేల ఆటోలు ఉన్నాయని.. రోజుకు 100 రూపాయల కూలీ పని చేయడం లేదని ఆటో డ్రైవర్లు అంటున్నారు. దీంతో కొందరు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను అమ్ముకుని.. వేరే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మఠపతి మండిపడ్డారు. ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే.. మృతదేహాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ ఎదుట పోరాటం చేస్తామన్నారు. హుబ్లీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ వీడియో ఇటీవల వైరల్గా మారింది. అందులో విషం బాటిల్ కావాలని ఏడుస్తూ అడిగాడు.
తాజావార్తలు
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..