Building Collapse : కుప్పకూలిన బిల్డింగ్.. 12 మందికి గాయాలు.. విచారణకు ఆదేశించిన మేజిస్ట్రేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapse : కార్గిల్ జిల్లాలో శనివారం కొండ వాలుపై మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో దాదాపు 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. భవనం కుప్పకూలినట్లు పోలీసు అధికారులు సమాచారం అందించారు. అదే స్థలం సమీపంలో జేసీబీ యంత్రం పనిచేస్తుండడంతో అక్కడ మట్టి కుంగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది.
శిథిలాల కింద నుంచి గాయపడిన ఐదుగురిని బయటకు తీశామని పోలీసులు తెలిపారు. వీరిలో జేసీబీ డ్రైవర్ కూడా ఉన్నారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎక్కువ మంది అక్కడ అద్దెకు ఉంటున్నవారే. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించి డ్రైవర్ను జేసీబీ యంత్రం నుంచి బయటకు తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు.
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
విచారణకు మేజిస్ట్రేట్ ఆదేశం
బిల్డింగ్ రెగ్యులేషన్ చట్టాల ఉల్లంఘనలపై కూడా కమిటీ విచారణ జరిపి దోషులను గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్గిల్ డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారు. ఘటనను సీరియస్గా తీసుకున్నామని, ఘటనపై విచారణకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, కార్గిల్ చైర్మన్ మరియు కార్గిల్ డిప్యూటీ కమిషనర్ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు. జిల్లాలోని దుర్బల ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇంకా కొంత మంది సమాధి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!