Building Collapse : కుప్పకూలిన బిల్డింగ్.. 12 మందికి గాయాలు.. విచారణకు ఆదేశించిన మేజిస్ట్రేట్
Building Collapse : కార్గిల్ జిల్లాలో శనివారం కొండ వాలుపై మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో దాదాపు 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. భవనం కుప్పకూలినట్లు పోలీసు అధికారులు సమాచారం అందించారు. అదే స్థలం సమీపంలో జేసీబీ యంత్రం పనిచేస్తుండడంతో అక్కడ మట్టి కుంగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది.
శిథిలాల కింద నుంచి గాయపడిన ఐదుగురిని బయటకు తీశామని పోలీసులు తెలిపారు. వీరిలో జేసీబీ డ్రైవర్ కూడా ఉన్నారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎక్కువ మంది అక్కడ అద్దెకు ఉంటున్నవారే. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించి డ్రైవర్ను జేసీబీ యంత్రం నుంచి బయటకు తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు.
Also Read
విచారణకు మేజిస్ట్రేట్ ఆదేశం
బిల్డింగ్ రెగ్యులేషన్ చట్టాల ఉల్లంఘనలపై కూడా కమిటీ విచారణ జరిపి దోషులను గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్గిల్ డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారు. ఘటనను సీరియస్గా తీసుకున్నామని, ఘటనపై విచారణకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, కార్గిల్ చైర్మన్ మరియు కార్గిల్ డిప్యూటీ కమిషనర్ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు. జిల్లాలోని దుర్బల ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇంకా కొంత మంది సమాధి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!