Peddireddy Ramachandra Reddy : సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యర్థాల నిర్వహణ ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుస్థిర వ్యర్థ నిర్వహణపై తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు సుమారు 51 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వ్యర్థాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యర్థాల నిర్వహణ ముఖ్యమని, వ్యర్థ నిర్వహణ ఒక బరువు గల బాధ్యతగా కాకుండా ఒక అవకాశం లా చూడాలన్నారు. తద్వారా అనేక మందికి ఉపాధి లభించడంతో పాటుగా గ్రీన్ హౌజ్ గ్యాస్ లను తగ్గించ వచ్చన్నారు. అంతేకాకుండా.. ‘ స్వీయ సుస్థిర వ్యర్థ నిర్వహణ మాత్రమే ఇందుకు పరిష్కారం. ఏపీలో 123 మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, నగరపంచాయత్లు ఉన్నాయి.
Also Read : Botsa Satyanarayana : అధికారానికి ఒక ఆకారం అంటూ ఉండదు
ఇందులో సుమారు 1.49 కోట్ల పట్టణ జనాభా, 44.57 లక్షల గృహాలు ఉన్నాయి. క్లీన్ ఆంధ్ర మిషన్ (క్లాప్) ద్వారా వ్యర్థ రహిత నగరాలుగా వీటిని తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం 3648 హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లు, డీజల్ మరియు ఎలెక్ట్రిక్ ఆటోలు, 24 వేల రిక్షాలు అందించాం. వీటి ద్వారా సుమారుగా రోజుకు 7 వేల టన్నుల వ్యర్ధాలను తరలిస్తున్నాం. ఇవేకాక 2.43 లక్షల టాయిలెట్స్, 623 పబ్లిక్ టాయిలెట్స్, 795 కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. వీటన్నిటి ద్వారా క్లాప్ సుమారుగా 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించింది.
Also Read : Sapota Nutrition Facts : సపోటా పండు తింటే ఇన్ని లాభాలా..?
ఇప్పటికే రాష్ట్రంలో 48 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అందుబాటులో ఉన్నాయి. మరో 59 నిర్మాణ దశలో ఉండగా, అదనంగా 206 టెండర్ దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తో రాష్ట్రంలో 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల చెత్త బుట్టలు అందించాం. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుమారు 2 కోట్ల చెత్త భుట్టలు అందించేందుకు రంగం సిద్దం చేస్తున్నాం. వ్యర్థాల నుండి విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రోజుకు 2400 టన్నుల వ్యర్థ నుండి 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి, చైతన్యం రావాలి. తద్వారా మరింత మంచి వాతావరణం నెలకొంటుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!