సినీ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్ లు జరుగుతుంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇది మొదటిసారి కాదు.. మూడవసారి. అవును వీరిద్దరి మూడు సార్లు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. తాజాగా ఈ మార్చి 19 అనగా ఈ రోజు మరోసారి వీరిద్దరూ థియేటర్ల వద్ద తలపడుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read : UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్
ఈ అరుదైన పోరు 2011లో మొదలైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పంజా మరియు రణవీర్ సింగ్ నటించిన ‘లేడీస్ వర్సెస్ రికీ బెల్’ సరిగ్గా డిసెంబర్ 9, 2011న విడుదలయ్యాయి. ఆ తర్వాత సుమారు 12 ఏళ్ల విరామం అనంతరం జూలై 28 2023న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాతో వస్తే, రణవీర్ సింగ్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే నెలకొంది. ఇక ఇప్పుడు మార్చి 19, 2026న ఈ ఇద్దరు హీరోలు హ్యాట్రిక్ క్లాష్ కు దిగారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈరోజే థియేటర్లలోకి రాగా, అటు బాలీవుడ్లో రణవీర్ సింగ్ నటించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘దురంధర్ 2’ కూడా నేడే విడుదలైంది. పదిహేనేళ్ల కాలంలో ఇలా మూడుసార్లు ఒకే తేదీన సినిమాలు విడుదల కావడం అనేది ఇద్దరు స్టార్ హీరోల కెరీర్లో ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోనుంది. మరి ఈ మూడవ పోరులో ‘ఉస్తాద్’ పైచేయి సాధిస్తాడా లేక ‘దురంధర్’ విజయం అందుకుంటాడా అన్నది వేచి చూడాలి.
