పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉంటూనే తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేస్తున్న పవన్, తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
Also Read : MIRZAPUR : మున్నా భయ్యా ఫ్యాన్స్ రెడీగా ఉండండి… మీర్జాపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తం షాట్ ను ఉగాది రోజు ఫిక్స్ చేసారు. పూజా కార్యక్రమాలతో ఉగాది రోజు తోలి షాట్ షూట్ చేయబోతున్నారు. ‘ధృవ’, ‘రేసుగుర్రం’ వంటి స్టైలిష్ చిత్రాలను అందించిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లుగా ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్తో పాటు స్టైలిష్ మేకింగ్ హైలైట్గా నిలవనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి, ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముహూర్తం పూర్తి చేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ తన పొలిటికల్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పవర్ స్టార్. మరోవైపు పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రిలీజ్ కాబోతుంది.