Site icon NTV Telugu

Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఆ తేదీల్లో ప్రచారానికి పవన్ రాక..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, ఆర్‌కే సాగర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

READ MORE: Xiaomi 18 Concept Design: నాలుగు 50MP కెమెరాస్, 6600mAh బ్యాటరీ.. హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్న షావోమీ 18!

మరోవైపు.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కాగా.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. మొన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశం అనంతరం రామచందర్‌రావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యాం. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాం. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఇది తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు తిరుగులేని వేగాన్ని అందిస్తుంది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ MORE: Best Selling Cars: అమ్మకాల్లో Tata Nexon దూకుడు.. జనవరిలో బెస్ట్‌సెల్లింగ్ కార్ల జాబితా ఇదిగో!

Exit mobile version