Pawan Kalyan: వైసీపీది విచ్ఛిన్నకర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్.
రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం చేసింది. బహుజన సిద్దాంతంపై వైసీపీ దాడి చేస్తోంది. తెలంగాణలో కులభావన లేదు.. రాష్ట్ర భావన ఉంది.. కానీ ఏపీలో కుల భావనే ఉంది తప్ప.. ఏపీ అనే భావన కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తి ఏసీబీని కంట్రోల్ చేస్తారట.. చాలా హస్యాస్పదంగా ఉంది.
Also Read
- Nara Lokesh: 'రప్పారప్పా' అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
వాళ్ల నాన్న సీఎంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నారు.. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.కాపులను..శెట్టిబలిజలనే తప్పు చేసిన వాళ్లుగా చూస్తున్నారు. శెట్టి బలిజలను దారుణంగా విమర్శిస్తున్నారు. ఇవన్నీ వైసీపీ కావాలనే చేస్తోంది.వైసీపీలోని రెండు వర్గాల మధ్య గొడవే.. కొనసీమలో చిచ్చుకు కారణం.క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగులబడుతుందా..?జనసేనను ఎలా తప్పు పడతారు..?వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినందుకు నిరసన తెలుపుతామంటే 144 సెక్షన్ పెట్టారే.. ఇంత పెద్ద గొడవకు జాగ్రత్త పడరా..?
కోనసీమ ఎపిసోడ్ వల్ల జనసేనకు ఏదో నష్టం జరుగుతుందని వైసీపీ భావిస్తే.. అది తెలివి తక్కువ తనమే అవుతుంది.నేను కులాలను కలిపే వాడినే కానీ.. విభజన చేసే వాడిని కాను.యువజనులకు ఉద్యోగాల్లేవ్, కార్మికులకు ఉపాధి లేదు.. రైతులకు గిట్టుబాటు లేదు.. ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అంటే నాకు గౌరవం. వైసీపీ కొన్ని కులాలను వర్గ శత్రువుగా ప్రకటించుకుంటోంది.
గతంలో కమ్మవాళ్లని వర్గ శత్రువుగా ప్రకటించినప్పుడే నేను తప్పు పట్టాను. ఓటేయని ప్రతి కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించే సంస్కృతిని తెచ్చింది వైసీపీ. ఇప్పుడు కమ్మొళ్లనే కాకుండా శెట్టిబలిజలు సహా కాపు, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలను వైసీపీ తన వర్గ శత్రువులుగా ప్రకటించింది. కమ్మొళ్లని తిట్టాల్సిందంతా తిట్టేసి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చాలా..? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ మరిచిపోతే మంచిది.
అర్ధం కాకుండా మాట్లాడ్డం బొత్సకు అలవాటు. ఎన్ని విమర్శలు చేసినా చేసుకోండి.. కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లేలా ప్రస్తావన తేవద్దు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదయోగ్యమే కానీ.. ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లింప చేయడం మాత్రం ఆమోదం కాదు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదమే.. కానీ ఏకాభిప్రాయానికి రావాల్సింది కోనసీమ ప్రజలే.
ఏకాభిప్రాయానికి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శాంతి కమిటీలు వేసుకోవాలి.. దీనికి జనసేన చొరవ తీసుకోవాలి. జనసేన-బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి.కానీ కరోనా కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. త్వరలోనే జనసేన-బీజేపీ మధ్య సోషల్ డిస్టెన్స్ తగ్గుతుంది.ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చలు కూడా జరిపామన్నారు పవన్.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!