Site icon NTV Telugu

Pawan Kalyan: అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్న ఒక్కరు మాట్లాడడం లేదని పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని.. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలని వారి ట్రాప్ లో పడద్దని సూచించారు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలని.. సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని సూచించారు.

Trike Bike CHILL: అల్ట్రా-కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ట్రైక్ బైక్ చిల్ రిలీజ్.. 150KM రేంజ్.. ఫీచర్స్ కేక

అర్వ శ్రీధర్ విషయంపై మాట్లాడిన ఆయన వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని హెచ్చరించారు. ఆ తర్వాత ఆగ్రహంతో మీటింగ్ లో నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇంకా వైసిపి నేతల వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలని.. వాళ్ల ట్రాప్ లో పడొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు వంటి విషయాల పైన కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చర్చించారు.

Highest runs in T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన తోపు ప్లేయర్స్ వీరే.. టాప్-5లో ఇద్దరు మనోళ్లే!

ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడద్దు అంటూ జనసేన నేతలను అలర్ట్ చేశాడు. ఇంకా ఈ మీటింగ్ లో మహిళా ఉద్యోగిని ఆరోపణతో రైల్వే కొడూరు ఎమమెల్యే అరమ శ్రీధర్ ఎపిసోడ్ వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ గా సీరియస్ అయ్యారు. ఇలా ఓవరాల్ గా పార్టీ నేతల వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ మంది పడి సమావేశం మధ్యలో నుంచే వెళ్ళిపోయి.. రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మంత్రి నాదన్నల మనోహర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శికి అప్పగించి వెళ్ళిపోయినట్టు సమాచారం.

Exit mobile version