Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!తెలంగాణపై సోషల్ మీడియా వేదికగా (X)లో మరోసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’. తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తన నిబద్ధత ఇటివల మొదలైంది కాదని.. 2009లో ప్రజాస్వామ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడే మొదలైందని అన్నారు. తాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గడ్డతో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానన్నారు.
సామాజిక న్యాయం ఆత్మగౌరవం సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అనే పునాదులపై నిర్మించబడిన సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చానని అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు నా మద్దతు ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది కాదన్నారు. ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల గుర్తింపు గౌరవానికి అర్హమైనవే. ఆ దృఢ విశ్వాసం నమ్మకంతో నేను దానికి మార్గ నిర్దేశం చేశానని గుర్తుచేశారు. రెండు రోకుల క్రితం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం “మీ అయ్యా జాగీరా” అనే అనడంతో ఇరు రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతగొంది.
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when… pic.twitter.com/UvzPayyQqp
— Pawan Kalyan (@PawanKalyan) June 3, 2026
