Deputy CM Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణలో తొలగించే 100–140 సంవత్సరాల పాత చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని నెలరోజుల్లో పాలసీ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు చేసిన సూచనలను ప్రభుత్వం పాజిటివ్గా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు చేసిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ రోడ్లు, బరియల్ గ్రౌండ్స్, క్యాటిల్ షెడ్స్, అడవి తల్లి బాట, పల్లె పండగ వంటి అంశాలపై సభ్యుల సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్లను తదుపరి ఎన్నికల ముందు ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మొక్కను జియో ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసే విధానం అమలు చేస్తామన్నారు. “రాజమండ్రిలో కొత్త నర్సరీ ప్రారంభించాం.. రెడ్ సాండర్స్ ధర , నిర్వహణపై మంత్రుల గ్రూప్ ఏర్పాటు.. పంచాయతీల రీస్ట్రక్చరింగ్పై కోర్టుల్లో ఎలాంటి కేసులు లేవు.. జల జీవన్ మిషన్లో గత ప్రభుత్వం పూర్తి చేయని మల్టీ విలేజ్ స్కీమ్స్ను పూర్తి చేశాం.. మరో 5 కొత్త మల్టీ విలేజ్ స్కీమ్స్ ప్రారంభించాం.. ఇటీవలే ఇంకా 7 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చాం.. తాగునీటి సమస్య ఉన్న 3000 గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..” అని పవన్ కల్యాణ్ వివరించారు.
READ MORE: Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. యూఎస్పై ఇరాన్ ఫైర్..
